రూట్ ఆ రికార్డులన్నింటినీ కొట్టేసెయ్..!
స్పిన్ను బాగా ఆడే తమ దేశ అత్యుత్తమ ఆటగాడు రూట్ అని, టెస్టుల్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ రికార్డులన్నీ అతను బద్దలుకొడతాడని మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు...
లండన్: స్పిన్ను బాగా ఆడే తమ దేశ అత్యుత్తమ ఆటగాడు రూట్ అని, టెస్టుల్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ రికార్డులన్నీ అతను బద్దలుకొడతాడని మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. స్పిన్కు సహకరించే చెపాక్ పిచ్పై తొలి ఇన్నింగ్స్లో రూట్ ద్విశతకం బాదిన సంగతి తెలిసిందే. ‘‘ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాళ్లలో కచ్చితంగా రూట్ ఒకడు. బహుశా అన్ని ఇంగ్లాండ్ బ్యాటింగ్ రికార్డులను అతను బద్దలు కొడతాడని అనుకుంటున్నా. అలిస్టర్ కుక్ పేరిట ఉన్న 161 మ్యాచ్ల రికార్డును, అత్యధిక పరుగులనూ దాటేసే వీలుంది. రూట్కు ఇప్పుడు 30 ఏళ్లే. ఆల్టైమ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ దిగ్గజాల జాబితాలో కుక్, గ్రహమ్ గూచ్, పీటర్సన్ సరసన రూట్ ఉంటాడు. స్పిన్ను ఆడడంలో అతనే అత్యుత్తమం. అతనాడే స్వీప్ షాట్లు చూసేందుకు రెండు కళ్లు చాలవు’’ అని హుస్సేన్ అన్నాడు. భారత్తో తొలి టెస్టులో పూర్తిస్థాయి ప్రదర్శనతో ఇంగ్లాండ్ గెలిచిందని అతనన్నాడు. తమ బౌలర్లకు విశ్రాంతినిచ్చి, వాళ్ల నుంచి పూర్తి స్థాయి ప్రదర్శన రాబట్టేందుకు రూట్.. తొలి టెస్టులో భారత్కు ఫాలోఆన్ ఆడే అవకాశం ఇవ్వలేదని హుస్సేన్ చెప్పాడు.
ఇవీ చదవండి..
‘ఇదిగో.. ఈ యెటకారాలే వద్దనేది వాన్’
టాస్ ఓడితే ఇంగ్లాండ్ పని అంతే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?