WTC Final: ఆ సిరీస్ కంటే.. మాకిదే గ్రాండ్ ఫైనల్: ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్
భారత్తో డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్ తెలిపాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా లైయన్ (83 వికెట్లు) కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: జూన్ 7వ తేదీ నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final) మ్యాచ్ ప్రారంభం కానుంది. దీని కోసం భారత్, ఆస్ట్రేలియా (AUS vs IND) జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. భారత శిబిరంపై కాస్త ఒత్తిడి పెంచేలా ఆసీస్ మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. స్టీవ్ స్మిత్, సహాయక కోచ్ డానియల్ వెటోరీ తదితరులు టీమ్ఇండియా తుది జట్టుపై మాట్లాడారు. అలాగే, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా పుజారా, విరాట్ కోహ్లీతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ఈ క్రమంలో ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్ ఆసీస్ సన్నద్ధతపై మాట్లాడాడు. అలాగే ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో యాషెస్ సిరీస్లో ఆసీస్ తలపడనుంది. ఆ సిరీస్ కంటే డబ్ల్యూటీసీ ఫైనల్ తమకు ఇప్పుడు కీలకమని వ్యాఖ్యానించాడు.
‘‘ఇదే నెలలో మేం యాషెస్ సిరీస్ ఆడబోతున్నాం. కానీ, అంతకుముందు మా ముందు అతిపెద్ద సవాల్ ఉంది. అదే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్. ఇదే మాకు గ్రాండ్ ఫైనల్. ఇక్కడ నుంచే మా క్రికెట్ సీజన్ ప్రారంభమవుతుంది. దీని కోసం మేమంతా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాం. మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయాలని ఎదురు చూస్తున్నాం. ప్రతి ఒక్క ఆసీస్ అభిమాని యాషెస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారని తెలుసు. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ను తిలకించేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
గత సిరీస్లో మేం టీమ్ఇండియా చేతిలో టెస్టు సిరీస్ ఓడపోయాం. భారత్ వేదికగా ఆ జట్టును అడ్డుకోవడం చాలా కష్టం. ప్రస్తుతం ఇరు జట్లూ నాణ్యమైన ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్నాయి. కచ్చితంగా గొప్ప మ్యాచ్ అవుతుంది. భారత జట్టులో క్లాస్ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. అలాగే పేస్ దళం కూడా బాగుంది. మా జట్టులోనూ కీలక ప్లేయర్లు ఉన్నారు. గతానుభవాలను వదిలేసి తాజాగా క్రికెట్ సీజన్ను ప్రారంభిస్తాం. విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం’’ అని లైయన్ తెలిపాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత జూన్ 16వ తేదీ నుంచి ఇంగ్లాండ్లోనే ఆసీస్ యాషెస్ సిరీస్ వేటను ప్రారంభించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు