Neeraj Chopra: కోహ్లీ సమీపంలోకి గోల్డెన్ బాయ్..!
నీరజ్ చోప్రా.. ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ ఉన్న పేర్లలో ఇది. వందేళ్లపాటు భారత్ ఎదురు చూసిన అథ్లెటిక్స్ స్వర్ణాన్ని అందించిన గోల్డెన్బాయ్గా రికార్డ్ సృష్టించాడు. దీంతో నీరజ్ బ్రాండ్ విలువ
దాదాపు 1000 శాతం పెరిగిన నీరజ్ బ్రాండ్ విలువ
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
నీరజ్ చోప్రా.. ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ ఉన్న పేరు ఇది. వందేళ్లపాటు భారత్ ఎదురు చూసిన అథ్లెటిక్స్ స్వర్ణాన్ని అందించిన గోల్డెన్బాయ్గా రికార్డు సృష్టించాడు. దీంతో నీరజ్ బ్రాండ్ విలువ అమాంతం పెరిగిపోయింది.
ఆరడగుల అందగాడు.. ఆపై ప్రపంచ ఛాంపియన్.. భారతీయ యువతకు ఐకాన్..! ఇంకేముంది ఇప్పుడు నీరజ్ కోసం బ్రాండ్లు క్యూకడుతున్నాయి. అతడు ఒలింపిక్ స్వర్ణం గెలిచిన రోజునే ఇన్స్టాలో ఈ ఛాంపియన్ ఫాలోవర్ల సంఖ్య పదకొండు లక్షలు పెరిగింది. నెలరోజుల వ్యవధిలో నీరజ్ను అనుసరించేవారి సంఖ్య 46 లక్షలను దాటేసింది. బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజ్ 1000 శాతం పెరిగినట్లు వార్తలొస్తున్నాయి.
సోషల్ మీడియాలో మెన్షన్స్ సునామీ..!
సోషల్ మీడియాలో నీరజ్ ఫాలోయింగ్పై ‘యూగోవ్ స్పోర్ట్స్’ అనే రీసెర్చ్ సంస్థ ఓ నివేదిక ఇచ్చింది. ఒలింపిక్స్ సమయంలో ఇన్స్టాగ్రామ్లో ప్రపంచంలోనే అత్యధిక మెన్షన్స్ అందుకున్న క్రీడాకారుడు నీరజ్ చోప్రా అని తేల్చింది. 14 లక్షల మంది ఆయన్ను 29లక్షల సార్లు మెన్షన్ చేశారు. పతకం రాక ముందు అతని మెన్షన్స్తో పోలిస్తే ఇది 1401 శాతం అధికం. ఇక ఆయన్ను మెన్షన్ చేసేవారి సంఖ్య 2055శాతం పెరిగింది. సోషల్ , డిజిటల్ మీడియాలో అతడి రీచ్ ఏకంగా 41.2 కోట్లకు చేరింది. ఈ అంకెలు మొత్తం నీరజ్ చోప్రా సోషల్ మీడియా విలువను రూ.428 కోట్లకు చేర్చినట్లు ఆ సంస్థ తేల్చింది.
ఒలింపిక్ స్వర్ణం తర్వాత పాక్ క్రీడాకారుడు అర్షాద్ నదీమ్పై నీరజ్ అభిమానులు విమర్శలు కురిపించారు. ఈ సమయంలో నీరజ్ పరిణతి, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఓ వీడియోను పోస్టు చేశారు. దీంతో భారతీయుల్లో ఈ కుర్రాడిపై మరింత అభిమానం పెరిగింది.
గతంలో నీరజ్ వాణిజ్య ప్రకటనల పునఃసమీక్ష..!
నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ రాక ముందు కూడా కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. అప్పట్లో ఆయన రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఛార్జ్ చేశారు. కానీ, ఇప్పుడు ఈ బల్లెం వీరుడి డిమాండ్ పెరిగిపోయింది. దీంతో గతంలో చేసుకొన్న ఒప్పందాల్లో మార్పులు చేసుకోనున్నారు. ఈ విషయాన్ని నీరజ్ బ్రాండ్ విషయాలు చూసుకొనే జెఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ సీఈవో ముస్తఫా గౌస్ ఎకనామిక్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘‘అవి మల్టీ బిలియన్ డీల్స్.. పారిస్ ఒలింపిక్స్ వరకు కొనసాగనున్నాయి’’ అని వెల్లడించారు.
మద్యం, పొగాకు ప్రకటనలకు దూరం..
నీరజ్ చోప్రా కేవలం డబ్బు మీదే దృష్టి పెట్టడం లేదు. సమాజంలో చెడు అలవాట్లను ప్రోత్సహించే వాటికి దూరంగా ఉండనున్నారు. ఆయన మద్యం, పొగాకు ఉత్పత్తుల ప్రకటనలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నట్లు సమాచారం.
క్యూకట్టిన 80 సంస్థలు..
నీరజ్ బంగారు పతకం సాధించాక అతని కోసం పెద్ద పెద్ద కంపెనీలు క్యూకట్టాయి. 80 కంపెనీలు ఈ గోల్డెన్బాయ్ను ప్రచారకర్తగా నియమించుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ వెల్లడించింది. కానీ, వచ్చే 12 నుంచి 14 నెలల్లో నీరజ్ దేశ విదేశాల్లో సాధన చేయనున్నారు. దీంతో కొన్ని రోజులు మాత్రమే వాణిజ్య ప్రకటనల చిత్రీకరణకు సమయం వెచ్చించే అవకాశం ఉంది. ఇప్పటికే నీరజ్ నైక్, గాటోరెడ్,ఎగ్జాన్ మొబిల్, మజిల్బ్లేజ్ వంటి కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్నాడు. ఒలింపిక్ విజయం తర్వాత బైజూస్,టాటా ఏఐఏ లైఫ్ ఇన్స్యూరెన్స్, మరో ఫార్మా కంపెనీతో ఒప్పందాలపై సంతకం చేశారు. మరోపక్క ఒక విలాసవంతమైన ఆటోమొబైల్, దుస్తుల బ్రాండ్లతో చర్చలు పురోగతిలో ఉన్నాయి.
పదిరెట్లు పెరిగిన ఫీజు..
నీరజ్ పతకం రాక ముందు ప్రచార కర్తగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన విలువ నాటితో పోలిస్తే కనీసం 10 రెట్లు పెరిగి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే రూ.కోటి నుంచి రూ.2.5 కోట్ల మధ్యకు నీరజ్ బ్రాండ్ విలువ చేరింది. ప్రస్తుతం భారత క్రీడాకారుల్లో క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలు మాత్రమే రూ. కోటి నుంచి రూ.5 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు నీరజ్ ఒక్కసారిగా రూ.2.5 కోట్లకు చేరుకొన్నారు. భారత క్రికెటర్లలో రోహిత్ శర్మ, కె.ఎల్.రాహుల్ తీసుకుంటున్నదానికంటే ఈ మొత్తం చాలా ఎక్కువ. తాజాగా నీరజ్ తొలిసారి చేసిన క్రెడ్ యాప్ ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్