WTC Final: యుద్ధ నినాదాల్లా కివీస్ సంబరాలు!
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓటమి బాధ కలిగించిందని టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. మ్యాచ్ ముగిశాక న్యూజిలాండ్ ఆటగాళ్లు రాత్రి 12 వరకు మైదానంలో సంబరాలు చేసుకున్నారని పేర్కొన్నాడు. వారి కేరింతలు యుద్ధ నినాదాల్లా అనిపించాయని వెల్లడించాడు....
బాధగా అనిపించిందన్న అశ్విన్
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓటమి బాధ కలిగించిందని టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. మ్యాచ్ ముగిశాక న్యూజిలాండ్ ఆటగాళ్లు రాత్రి 12 వరకూ మైదానంలో సంబరాలు చేసుకున్నారని పేర్కొన్నాడు. వారి కేరింతలు యుద్ధ నినాదాల్లా అనిపించాయని వెల్లడించాడు.
‘మ్యాచ్ ముగిశాక పానీయాలు, ట్రోఫీతో కలిసి సంబరాలు చేసుకోవడం న్యూజిలాండ్ అలవాటు. ఆ దృశ్యం చూడటానికి కష్టంగా అనిపించింది. వారు రాత్రి 12 వరకూ వేడుకలు చేసుకున్నారు. వారు ట్రోఫీ తీసుకొని పిచ్ వద్దకు వచ్చారు. నిజానికి వారి సంబరాలు నాకు యుద్ధ నినాదాల్లా అనిపించాయి. మేం గెలవనందుకు నిరాశపడ్డా’ అని అశ్విన్ చెప్పాడు.
‘ఛాంపియన్షిప్ ఫైనల్ను మూడు మ్యాచ్లుగా నిర్వహించాలని విరాట్ కోహ్లీ చెప్పాడని ఇతరులు అనుకోవడం నేను విన్నాను. కానీ, అదంతా తప్పు. ఆరోజు మ్యాచ్ పూర్తయ్యాక ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మైఖేల్ అథర్టన్ కోహ్లీతో మాట్లాడుతూ ఈ ఛాంపియన్షిప్ ఫైనల్ను మరింత ప్రత్యేకంగా నిర్వహించాలంటే ఏం చేసేవాడివని అడిగారు. అప్పుడతడు స్పందిస్తూ.. ఫైనల్ను మూడు మ్యాచ్ల సిరీస్గా నిర్వహిస్తే తొలి మ్యాచ్లో వెనుకబడిన జట్టు తర్వాతి మ్యాచ్లో పుంజుకుంటుందని, పరిస్థితులను కూడా అర్థం చేసుకునే వీలు కలుగుతుందనే ఉద్దేశంతో చెప్పాడు. కానీ, కోహ్లీ ఎప్పుడూ బెస్ట్ ఆఫ్ త్రీ కోసం డిమాండ్ చేయలేదు’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో వివరించాడు.
ప్రస్తుతం విరామం లభించడంతో అశ్విన్ తన కుటుంబంతో కలిసి బ్రిటన్ అంతా చుట్టేస్తున్నాడు. ‘మేం బయో బుడుగల్లో కాలం గడుపుతున్నాం. చాన్నాళ్ల తర్వాత బయటకు వచ్చాం. తాజా గాలి పీల్చుకుంటున్నాం. నేనో కారు అద్దెకు తీసుకున్నా. దేశమంతా తిరుగుతున్నా. మొదట మేం డేవాన్ సందర్శించాం. అదెంతో అందంగా ఉంది. ఆ తర్వాత సముద్రం, కొండ అంచులు కలిసే ప్రదేశానికి చేరుకున్నాం’ అని యాష్ చెప్పాడు.
ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీసు ఆరంభానికి మరో నెల రోజుల సమయం ఉంది. బ్రిటన్లో కేసులు తక్కువగా ఉండటంతో ఆటగాళ్లకు మూడు వారాలు విరామం ఇచ్చారు. బయో బుడగ నుంచి బయటకొచ్చిన క్రికెటర్లు కుటుంబ సభ్యులతో కలిసి దేశమంతా తిరుగుతున్నారు. దర్శనీయ స్థలాలకు వెళ్తున్నారు. ఆటలపై ఆసక్తి ఉన్నవారు యూరోకప్, వింబుల్డన్కు వెళ్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’