WTC Final: యుద్ధ నినాదాల్లా కివీస్ సంబరాలు!
బాధగా అనిపించిందన్న అశ్విన్
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓటమి బాధ కలిగించిందని టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. మ్యాచ్ ముగిశాక న్యూజిలాండ్ ఆటగాళ్లు రాత్రి 12 వరకూ మైదానంలో సంబరాలు చేసుకున్నారని పేర్కొన్నాడు. వారి కేరింతలు యుద్ధ నినాదాల్లా అనిపించాయని వెల్లడించాడు.
‘మ్యాచ్ ముగిశాక పానీయాలు, ట్రోఫీతో కలిసి సంబరాలు చేసుకోవడం న్యూజిలాండ్ అలవాటు. ఆ దృశ్యం చూడటానికి కష్టంగా అనిపించింది. వారు రాత్రి 12 వరకూ వేడుకలు చేసుకున్నారు. వారు ట్రోఫీ తీసుకొని పిచ్ వద్దకు వచ్చారు. నిజానికి వారి సంబరాలు నాకు యుద్ధ నినాదాల్లా అనిపించాయి. మేం గెలవనందుకు నిరాశపడ్డా’ అని అశ్విన్ చెప్పాడు.
‘ఛాంపియన్షిప్ ఫైనల్ను మూడు మ్యాచ్లుగా నిర్వహించాలని విరాట్ కోహ్లీ చెప్పాడని ఇతరులు అనుకోవడం నేను విన్నాను. కానీ, అదంతా తప్పు. ఆరోజు మ్యాచ్ పూర్తయ్యాక ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మైఖేల్ అథర్టన్ కోహ్లీతో మాట్లాడుతూ ఈ ఛాంపియన్షిప్ ఫైనల్ను మరింత ప్రత్యేకంగా నిర్వహించాలంటే ఏం చేసేవాడివని అడిగారు. అప్పుడతడు స్పందిస్తూ.. ఫైనల్ను మూడు మ్యాచ్ల సిరీస్గా నిర్వహిస్తే తొలి మ్యాచ్లో వెనుకబడిన జట్టు తర్వాతి మ్యాచ్లో పుంజుకుంటుందని, పరిస్థితులను కూడా అర్థం చేసుకునే వీలు కలుగుతుందనే ఉద్దేశంతో చెప్పాడు. కానీ, కోహ్లీ ఎప్పుడూ బెస్ట్ ఆఫ్ త్రీ కోసం డిమాండ్ చేయలేదు’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో వివరించాడు.
ప్రస్తుతం విరామం లభించడంతో అశ్విన్ తన కుటుంబంతో కలిసి బ్రిటన్ అంతా చుట్టేస్తున్నాడు. ‘మేం బయో బుడుగల్లో కాలం గడుపుతున్నాం. చాన్నాళ్ల తర్వాత బయటకు వచ్చాం. తాజా గాలి పీల్చుకుంటున్నాం. నేనో కారు అద్దెకు తీసుకున్నా. దేశమంతా తిరుగుతున్నా. మొదట మేం డేవాన్ సందర్శించాం. అదెంతో అందంగా ఉంది. ఆ తర్వాత సముద్రం, కొండ అంచులు కలిసే ప్రదేశానికి చేరుకున్నాం’ అని యాష్ చెప్పాడు.
ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీసు ఆరంభానికి మరో నెల రోజుల సమయం ఉంది. బ్రిటన్లో కేసులు తక్కువగా ఉండటంతో ఆటగాళ్లకు మూడు వారాలు విరామం ఇచ్చారు. బయో బుడగ నుంచి బయటకొచ్చిన క్రికెటర్లు కుటుంబ సభ్యులతో కలిసి దేశమంతా తిరుగుతున్నారు. దర్శనీయ స్థలాలకు వెళ్తున్నారు. ఆటలపై ఆసక్తి ఉన్నవారు యూరోకప్, వింబుల్డన్కు వెళ్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
UP: మహిళపై దాడి.. భాజపా నేతకు యోగి సర్కార్ ఝలక్..!
-
General News
Picnic: ఒక్కసారిగా వరద.. కొట్టుకుపోయిన 14 కార్లు..
-
India News
Rajinikanth: రాజకీయాల్లోకి వస్తారా? రజనీకాంత్ సమాధానమేంటంటే..?
-
Crime News
Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
-
General News
Telangana News: కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు
-
Movies News
Thirteen Lives review: రివ్యూ: థర్టీన్ లైవ్స్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Hyderabad News: కారు డ్రైవర్పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- China: చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!
- Taapsee: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు: తాప్సి
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Allu Arjun: కల్యాణ్రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్