IND vs NZ: ఇప్పుడు మూడో ర్యాంక్.. చివరి వన్డేలోనూ గెలిస్తే.. భారత్దే నంబర్వన్..!
న్యూజిలాండ్తో (IND vs NZ) జరిగిన రెండు వన్డేల్లోనూ టీమ్ఇండియా (Team India) ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకొంది. ఈ క్రమంలో ఐసీసీ (ICC) ర్యాంకింగ్స్లోనూ భారత్ తన స్థానాన్ని మెరుగుపర్చుకొంది.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్ మీద వరుసగా రెండు వన్డేలు గెలిచిన టీమ్ఇండియా ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ దూసుకుపోతోంది. సిరీస్ను కోల్పోయిన కివీస్ వన్డేల్లో రెండో స్థానానికి పడిపోయింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో భారత్ మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ (113) అగ్రస్థానంలో ఉంది. కివీస్, భారత్ కూడా 113 పాయింట్లతో సంయుక్తంగా ఉన్నప్పటికీ కొద్దిపాటి తేడాతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా (112), పాకిస్థాన్ (106) టాప్-5లో ఉన్నాయి.
భారత్- కివీస్ రెండో వన్డేకు ముందు.. న్యూజిలాండ్ 115 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండేది. భారత్ 111 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగేది. అయితే కివీస్ ఓడిపోవడం.. భారత్ విజయం సాధించడంతో ఇంగ్లాండ్కు కలిసొచ్చింది. కివీస్ ఖాతాలో 2 పాయింట్లు కోత పడగా.. టీమ్ఇండియాకి 2 పాయింట్లు అదనంగా యాడ్ అయ్యాయి. దీంతో భారత్ మూడో స్థానంలోకి దూసుకొచ్చింది. కివీస్ రెండో స్థానంలోకి పడిపోయింది. మంగళవారం జరిగే చివరి వన్డేలోనూ టీమ్ఇండియా విజయం సాధిస్తే అగ్రస్థానంలోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. అలాగే వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్నూ భారత్ సొంతం చేసుకొంటే.. సుదీర్ఘ ఫార్మాట్లోనూ అగ్రస్థానంలోకి వచ్చే ఛాన్స్లు ఉన్నాయి.
గిల్ 10 స్థానాలు ముందుకు..
కివీస్పై డబుల్ సెంచరీ సాధించిన శుభ్మన్ గిల్ (624 పాయింట్లు) ఏకంగా పది ర్యాంక్లను ఎగబాకి 26వ స్థానంలోకి దూసుకొచ్చాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (750) కూడా నాలుగు స్థానాలను మెరుగుపర్చుకొని నాలుగో స్థానంలోకి వచ్చాడు. టీ20ల్లో మాత్రం సూర్యకుమార్ యాదవ్ (908 పాయింట్లు) అగ్ర స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)