WTC Final: న్యూజిలాండ్ ఛాంపియన్
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. టీమ్ఇండియాను ఓడించి తొలిసారి నిర్వహిస్తున్న ఈ మెగా ట్రోఫీని కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో భారత్
తుదిపోరులో భారత్ ఓటమి..
కివీస్ను గెలిపించిన టేలర్, విలియమ్సన్
సౌథాంప్టన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. టీమ్ఇండియాను ఓడించి తొలిసారి నిర్వహిస్తున్న ఈ మెగా ట్రోఫీని కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 45.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినా కెప్టెన్ కేన్ విలియమ్సన్ (52; 89 బంతుల్లో 8x4), రాస్టేలర్ (47; 100 బంతుల్లో 6x4) బాధ్యతగా ఆడి కివీస్కు అపురూప విజయం అందించారు. అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్ ఓపెనర్లు టామ్ లాథమ్(9; 41 బంతుల్లో), డెవాన్ కాన్వే(19; 47 బంతుల్లో 4x4)ను ఔట్ చేసి భారత్కు శుభారంభం ఇచ్చాడు. దాంతో ఆ జట్టుపై ఒత్తిడి పెంచే అవకాశం దక్కినా టీమ్ఇండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఓటమిపాలై ఐసీసీ టోర్నీల్లో మరోసారి భంగపాటుకు గురైంది.
కాగా, టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో 170 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(41; 88 బంతుల్లో 4x4) టాప్ స్కోరర్గా నిలిచాడు. కివీస్ పేసర్లు టిమ్సౌథీ 4/48, బౌల్ట్ 3/39 రాణించడంతో భారతబ్యాట్స్మెన్ తడబడ్డారు. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 32 పరుగులు కలుపుకొని న్యూజిలాండ్ అంతిమ లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు 64/2 ఓవర్నైట్ స్కోరుతో ఆరోరోజు రిజర్వ్డే ఆట కొనసాగించిన కెప్టెన్ విరాట్ (13; 29 బంతుల్లో), చెతేశ్వర్ పుజారా (15; 80 బంతుల్లో 2x4) నిరాశపరిచారు. ఆట ప్రారంభమైన అరగంటకే ఒక్క పరుగు తేడాతో ఇద్దరూ పెవిలియన్ చేరారు. జేమీసన్ వరుస ఓవర్లలో వీరిని ఔట్చేశాడు.
ఆ తర్వాత రహానె (15; 40 బంతుల్లో 1x4) సైతం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కాసేపు వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేసినా చివరికి బౌల్ట్ బౌలింగ్లో ఔటయ్యాడు. లెగ్సైడ్ వెళ్లే బంతిని ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. ఆపై పంత్, జడేజా(16; 49 బంతుల్లో 2x4) జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును మెల్లిగా ముందుకు తీసుకెళ్లారు. వారిద్దరూ ఆరో వికెట్కు 33 పరుగులు జోడించారు. ఈ నేపథ్యంలోనే స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. తొలుత జడ్డూ వాగ్నర్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇవ్వగా కాసేపటికే పంత్.. బౌల్ట్ బౌలింగ్లో నికోల్స్ చేతికి చిక్కాడు. అప్పటికి టీమ్ఇండియా స్కోర్ 156/7గా నమోదైంది. ఇక టెయిలెండర్లు అశ్విన్(7), షమి(13), బుమ్రా(0) కూడా పెద్దగా రాణించకపోవడంతో భారత్ 170 పరుగులకే పరిమితమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు