Women’s World Cup : హర్మన్ పోరాడినా.. టీమ్ఇండియాకు తప్పని ఓటమి
మహిళల ప్రపంచకప్లో టీమ్ఇండియాకు తొలి ఓటమి ఎదురైంది. మొదటి మ్యాచ్లో...
మహిళల ప్రపంచకప్ మ్యాచ్లో కివీస్ ఘన విజయం
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రపంచకప్లో టీమ్ఇండియాకు తొలి ఓటమి ఎదురైంది. మొదటి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాక్పై గెలిచి ఊపు మీదున్న భారత్ను న్యూజిలాండ్ 62 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్ నెగ్గిన టీమ్ఇండియా బౌలింగ్ ఎంచుకుని కివీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అనంతరం 261 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 198 పరుగులకే కుప్పకూలింది. టీమ్ఇండియా బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ (71) ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. మిగతా బ్యాటర్లలో యాస్తిక భాటియా 28, స్మృతి మంధాన 6, దీప్తి శర్మ 5, మిథాలీరాజ్ 31, స్నేహ్ రాణా 18, పూజా వస్త్రాకర్ 6, జులన్ గోస్వామి 15, మేఘ్న సింగ్ 12* పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో లీ తహుహు 3, అమెలీయా కీర్ 3.. జెన్సన్ 2.. జెస్ కెర్ర్, రోవే చెరో వికెట్ పడగొట్టారు.
ఆ నలుగురు కివీస్ను నిలబెట్టారు..
తొమ్మిది పరుగులకే తొలి వికెట్ను కోల్పోయిన కివీస్ను డివైన్ (35)తో కలిసి కెర్ర్ (50) ఇన్నింగ్స్ను నిలబెట్టింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 46 పరుగులు జోడించారు. అయితే డివైన్ పెవిలియన్కు చేరినా శాటర్త్వైట్ (75)తో కలిసి కెర్ర్ సమయోచిత ఇన్నింగ్స్ ఆడింది. ఈ క్రమంలో వీరు అర్ధశతకాలను పూర్తి చేసుకున్నారు. గ్రీన్ (27), మార్టిన్ (41)లతో శాటర్త్వైట్ భాగస్వామ్యాలను నిర్మించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపింది. అయితే భారత బౌలర్లు ఆఖర్లో విజృంభించడంతో చివరి ఐదు ఓవర్లలో న్యూజిలాండ్ 27 పరుగులే చేసి నాలుగు వికెట్లను కోల్పోవడంతో భారీ స్కోరును చేసే అవకాశం చేజారింది. టీమ్ఇండియా బౌలర్లలో పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లు తీయగా రాజేశ్వర్ గైక్వాడ్ రెండు, దీప్తి శర్మ, ఝులన్ గోస్వామి ఒక వికెట్ తీశారు.
ఝలన్ గోస్వామి రికార్డు
భారత బౌలర్ ఝులన్ గోస్వామి తన ఖాతాలో ఓ రికార్డును వేసుకుంది. మహిళా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు (39) తీసిన బౌలర్గా ఆసీస్కు చెందిన లిన్ ఫుల్స్టోన్తో కలిసి సంయుక్తంగా నిలిచింది. టీమ్ఇండియాకు ఇంకా మ్యాచ్లు ఉండటంతో గోస్వామి టాప్లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో గోస్వామి (9-1-1-41) ఫర్వాలేదనిపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల