IND vs NZ: బాబూ.. ఎవరైనా కాస్త ఆ కాయిన్లను పరీక్షించండయ్యా!
రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన టీమ్ఇండియా...
కివీస్ వరుసగా నాలుగోసారి టాస్ ఓడిపోవడంపై నీషమ్ స్పందన
ఇంటర్నెట్ డెస్క్: రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన టీమ్ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత పర్యటనలో వరుసగా నాలుగోసారి కివీస్ టాస్ ఓడిపోవడం గమనార్హం. మూడు టీ20ల సిరీస్లోనూ ఒక్కసారి కూడా టాస్ నెగ్గలేదు. దీంతో తమ జట్టు టాస్ ఓడిపోవడంపై కివీస్ ఆటగాడు జిమ్మీ నీషమ్ ట్విటర్ వేదికగా తమాషాగా స్పందించాడు. ట్విటర్లో యాక్టివ్గా ఉండే నీషమ్ తనదైన హాస్యచతురతతో ట్వీట్లు పెడుతుంటాడు. ఈ క్రమంలోనే టాస్ ఓడిపోవడంపై ‘‘దయ చేసి ఎవరైనా టాస్ వేసే కాయిన్లను దగ్గరగా పరీక్షించండి’’ అంటూ సరదాగా ఓ ట్వీట్ వేసేశాడు. దీనికి నెటిజన్ల నుంచి కామెంట్ల వర్ష కురిసింది. ‘‘ఏమో ఫిక్సింగ్ జరిగిందేమోనని’’ ఒకరు స్పందించగా.. ‘‘ఏం ఫర్వాలేదు.. వచ్చే మ్యాచ్కు విరాట్ వచ్చేస్తాడు. మీరు తప్పకుండా టాస్ గెలుస్తారు.. కంగారు పడకండి’’... ‘విరాట్ కూడా వరుసగా పదిసార్లు టాస్ ఓడిపోయాడు.. అయినా మీలాగా ట్విటర్లో బాధపడలేదు’’ అంటూ నెటిజన్ల చమక్కులు విసిరారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పంత్, బుమ్రా, షమీ వంటి సీనియర్లు లేకుండా అజింక్యా రహానె సారథ్యంలో టీమ్ఇండియా బరిలోకి దిగింది. శ్రేయస్ అయ్యర్ టెస్టు జట్టులోకి అరంగేట్రం చేశాడు. కేఎల్ రాహల్ గాయపడటంతో అతడి స్థానంలో సూర్యకుమార్ వచ్చేశాడు. అయితే తుది జట్టులోకి మాత్రం స్థానం దక్కలేదు. ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్ దిగారు. ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా, అక్షర్ పటేల్, అశ్విన్, ఇషాంత్, ఉమేశ్ యాదవ్తో కూడిన జట్టు ఆడుతోంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా భారీ స్కోరు సాధిస్తే విజయం సాధించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
సోధి తర్వాత రచిన్ రవీంద్ర
న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన రచిన్ రవింద్ర ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండో అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 22 ఏళ్ల ఏడు రోజుల వయసులో కివీస్ జట్టులోకి రచిన్ వచ్చాడు. ఇష్ సోధి (21 ఏళ్ల 325 రోజులు) కివీస్ టెస్టు జట్టులోకి వచ్చిన పిన్నవయస్కుడిగా కొనసాగుతున్నాడు. రచిన్ రవింద్ర ఇప్పటి వరకు కివీస్ తరఫున కేవలం ఆరు టీ20లు మాత్రమే ఆడటం గమనార్హం. భారత్పై తొలి టెస్టులో అజాజ్ పటేల్, సోమర్విల్లేలతోపాటు రచిన్ స్పిన్ దాడి చేస్తున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగే రచిన్కు ఆల్రౌండర్గా గుర్తింపు ఉంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో కివీస్ తన మొదటి మ్యాచ్ను ఆడుతుండటం విశేషం.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్