IND vs NZ: ఇదొక ‘అర్థంలేని సిరీస్’.. జోక్ చేశానన్న కివీస్ ఆల్రౌండర్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్ పర్యటనలో ఉంది. భారత్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ను మరొక మ్యాచ్...
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్ పర్యటనలో ఉంది. మూడు టీ20ల సిరీస్ను మరొక మ్యాచ్ ఉండగానే భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గైర్హాజరీతో టిమ్సౌథీ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. టీ20 సిరీస్ అనంతరం టీమ్ఇండియా, కివీస్ జట్ల మధ్య రెండు టెస్టులు జరుగుతాయి. ఈ క్రమంలో టీ20 సిరీస్ ఓడిపోవడంపై ఓ క్రికెట్ అభిమాని చేసిన ట్వీట్కు న్యూజిలాండ్ ఆల్రౌండర్ మిచెల్ మెక్క్లాగెన్ స్పందిస్తూ.. ఇదొక ‘అర్థం లేని సిరీస్’గా అభివర్ణించాడు.
ఏబీ డివిలియర్స్ క్రికెట్కు వీడ్కోలు పలికిన సందర్భంగా మెక్క్లాగన్ ట్విటర్ వేదికగా స్పందిస్తున్న సమయంలో ఓ అభిమాని ‘న్యూజిలాండ్ సిరీస్ను కోల్పోయింది’ అని ట్వీట్ చేశాడు. దీనికి మెక్క్లాగన్ సమాధానం ఇస్తూ.. వారి కంటే (కివీస్) ఎక్కువ విశ్రాంతి తీసుకున్న స్వదేశీ జట్టుతో తలపడుతున్నట్లు పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన కివీస్ కేవలం 72 గంటల్లోనే దుబాయ్ నుంచి వచ్చి టీ20 సిరీస్లో పాల్గొందని ట్వీట్ చేశాడు. ఐదు రోజుల వ్యవధిలో మూడు మ్యాచ్లను ఆడిందని గుర్తు చేశాడు. అయితే కాసేపటికి మరొక అభిమాని ట్వీట్కు రిప్లే ఇస్తూ.. ‘‘నేను జోక్ చేశా. న్యూజిలాండ్ సిరీస్ను గెలవడాన్ని ఎప్పుడూ ఇష్టపడతా’’ అని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.