Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. ప్రపంచ ఛాంపియన్షిప్లో పసిడి పంచ్
భారత బాక్సింగ్ యువ సంచలనం.. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో..
ఇస్తాంబుల్: భారత బాక్సింగ్ యువ సంచలనం.. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిఖత్ జరీన్ స్వర్ణపతకం గెలిచింది. 52 కిలోల విభాగంలో ఫైనల్లో జిట్పాంగ్ (థాయ్లాండ్)పై 5-0 తేడాతో అద్భుత విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు నమోదు చేసింది. బౌట్ ఆరంభం నుంచి ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించింది. రింగ్లో దూకుడుగా కదిలిన ఆమె ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. ప్రత్యర్థిపై ముష్టి ఘాతాలతో విరుచుకుపడింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచిన ఐదో బాక్సర్గా రికార్డు సృష్టించింది. అంతకుముందు మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ మాత్రమే గోల్డ్ మెడల్ను సాధించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో బల్గేరియాలోని సోఫియా వేదికగా జరిగిన 73వ స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్లోనూ 52 కేజీల విభాగంలోనే స్వర్ణపతకం గెలుచుకుంది. జూనియర్ స్థాయిలో ఆమెకి రెండో స్ట్రాంజా టోర్నమెంట్ పతకం కావడం గమనార్హం. 2019లోనూ బంగారు పతకం కైవసం చేసుకుంది. నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్గా గెలవడంతో ఆమె కుటుంబసభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. లాల్బహదూర్ స్టేడియంలో మ్యాచ్ లైవ్ వీక్షించిన నిఖత్ జరీన్ తండ్రి జమీల్, బాక్సింగ్ కోచ్లు, క్రీడాకారులు స్టేడియంలో సంతోషంతో సంబరాలు చేసుకున్నారు.
మన బాక్సర్లు మనల్ని గర్వించేట్లు చేశారు: ప్రధాని మోదీ
యువ బాక్సర్ నిఖత్ జరీన్ విజయం సాధించడంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘‘మన బాక్సర్లు మనల్ని గర్వించేట్లు చేశారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్కు అభినందనలు. కాంస్య పతకాలు సాధించిన మనీష, పర్వీన్ హుడాకు కూడా అభినందనలు’’ అని పేర్కొన్నారు.
జరీన్కు అభినందనలు తెలిపిన గవర్నర్ తమిళిసై
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన యువబాక్సర్ నిఖత్ జరీన్కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందనలు తెలిపారు. నిఖత్ జరీన్ను చూసి తెలంగాణ గర్విస్తోందన్నారు.
జరీన్ విశ్వవిజేతగా నిలవడం రాష్ట్రానికి గర్వకారణం: సీఎం కేసీఆర్
యువ బాక్సర్ నిఖత్ జరీన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. జరీన్ విశ్వవిజేతగా నిలవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని తెలిపారు. యువక్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం పేర్కొన్నారు.
నిఖత్ జర్నీ అందరికీ స్ఫూర్తి: తెదేపా అధినేత చంద్రబాబు
ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్కు తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. పురుషాధిక్యం ఉన్న క్రీడలో ఎన్నో ఇబ్బందులను తట్టుకొని నిజామాబాద్ బిడ్డ నిఖత్ జరీన్ తనకంటూ గుర్తింపు తెచ్చుకుందని చంద్రబాబు అన్నారు. తన ప్రయాణం అందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. నిఖత్ విజయం పట్ల గర్విస్తున్నట్లు ట్వీట్ చేశారు.
రూ. లక్ష ప్రోత్సాహం ప్రకటించిన మంత్రి ప్రశాంత్రెడ్డి
నిఖత్ జరీన్ విజయం పట్ల తెలంగాణ మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభినందనలు తెలిపారు. జరీన్ గెలుపు తెలంగాణ, నిజామాబాద్ జిల్లాకు గర్వకారణమని ప్రశాంత్రెడ్డి అన్నారు. భవిష్యత్లో జరీన్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి జరీన్కు వ్యక్తిగతంగా రూ.లక్ష ప్రోత్సాహకం ప్రకటించారు. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందేలా చొరవ తీసుకుంటానని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు