జరీన్ పంచ్: 2సార్లు ప్రపంచ విజేత ఓటమి
తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ అదరగొడుతోంది. ఇస్తాంబుల్లో జరుగుతున్న బోస్ఫోరస్ బాక్సింగ్ టోర్నీలో సంచలనాలు సృష్టిస్తోంది. ప్రపంచ విజేతలకు వరుస షాకులిస్తోంది. 51కిలోల విభాగంలో శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ నజిమ్ కిజైబేను ఆమె ఓడించింది....
దిల్లీ: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ అదరగొడుతోంది. ఇస్తాంబుల్లో జరుగుతున్న బోస్ఫోరస్ బాక్సింగ్ టోర్నీలో సంచలనాలు సృష్టిస్తోంది. ప్రపంచ విజేతలకు వరుస షాకులిస్తోంది. 51 కిలోల విభాగంలో శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ నజిమ్ కిజైబేను ఆమె ఓడించింది. 4-1 తేడాతో మట్టికరిపించింది. 2014, 2016 ప్రపంచ ఛాంపియన్షిప్స్లో నజిమ్ స్వర్ణ పతకాలు కొల్లగొట్టడం గమనార్హం.
నిఖత్ గతంలో ఎప్పుడూ లేనంత ఆత్మవిశ్వాసంతో బాక్సింగ్ చేస్తోంది. ప్రిక్వార్టర్స్లో 2019 ప్రపంచ ఛాంపియన్, రష్యాకు చెందిన ఎకటెరినాను ఓడించి కాంస్యాన్ని ఖాయం చేసుకుంది. ఇప్పుడు క్వార్టర్స్లో ఏకంగా రెండుసార్లు విజేతను చిత్తుచేసి మెరుగైన పతకంపై గురిపెట్టింది. తన తర్వాతి పోరులో కఠిన ప్రత్యర్థి, 2019 ప్రపంచ ఛాంపియన్షిప్ రజత పతక విజేత బెసునాజ్ కాకిరోగ్లుతో తలపడనుంది.
పురుషుల విభాగంలో 2018 కామన్వెల్త్ క్రీడల విజేత గౌరవ్ సోలంకి (57 కిలోలు) సెమీస్కు దూసుకెళ్లాడు. స్థానిక బాక్సర్ అయికోల్ మిజాన్ను చిత్తు చేశాడు. సాంకేతికంగా ఆధిపత్యం చెలాయించిన అతడు 4-1తో విజయం అందుకున్నాడు. సెమీస్లో అర్జెంటీనా బాక్సర్ నిర్కో కుయెల్లోను ఢీకొట్టనున్నాడు. భారత మరో అగ్రశ్రేణి బాక్సర్ శివథాప (63 కిలోలు)కు అదృష్టం కలిసిరాలేదు. టర్కీ క్రీడాకారులు హకన్ డొగాన్తో హోరాహోరీగా సాగిన పోరులో 1-4 తేడాతో వెనుదిరిగాడు. సోనియా లాథర్ (57 కిలోలు), పర్వీన్ (60 కిలోలు), జ్యోతి (69 కిలోలు) క్వార్టర్స్తోనే ముగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం
-
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM