Rishabh: భవిష్యత్తు భారత సారథి పంత్
Sunil Gavaskar: రిషభ్ పంత్ టీమ్ఇండియా భవిష్యత్తు సారథి అనడంలో సందేహం లేదని క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నారు....
సన్నీ గావస్కర్ ప్రశంసలు
ఇంటర్నెట్ డెస్క్: రిషభ్ పంత్ టీమ్ఇండియా భవిష్యత్తు సారథి అనడంలో సందేహం లేదని క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నారు. ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ను అతడు చక్కగా ముందుకు నడిపించాడని పేర్కొన్నారు. జట్టును గెలిపించాలన్న జ్వాల, నేర్చుకొనే తపన అతడిలో కనిపించాయని తెలిపారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఈ ఏడాది దిల్లీని రిషభ్ పంత్ నడిపించాడు. శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో అతడికి అవకాశం వచ్చింది. దానిని అతడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 8 మ్యాచుల్లో 6 విజయాలు అందించాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాడు. అంతేకాకుండా సారథిగా చేసిన పొరపాట్లను సరిదిద్దుకొంటూ నేర్చుకున్నాడు. ఇవన్నీ విశ్లేషకులను అమితంగా ఆకట్టుకున్నాయి.
‘యువ రిషభ్ సారథ్యంలో దిల్లీ నిలబడింది. ప్రతిసారీ నాయకత్వం గురించి ప్రశ్నించే సరికి ఆరో మ్యాచుకే అతడు విసిగిపోవడం మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రతి మ్యాచ్ తర్వాత అతడిని ఇదే ప్రశ్న అడుగుతున్నారు. చూసొచ్చేందుకు అనుమతిస్తే కాల్చొచ్చేందుకు సిద్దంగా ఉంటానన్న జ్వాలను అతడు ప్రదర్శించాడు. అవును, సారథిగా కొన్ని తప్పులు చేశాడు. కానీ, పొరపాట్లు చేయని సారథి ఎవరుంటారు?’ అని సన్నీ అన్నారు.
‘పొరపాట్ల నుంచి నేర్చుకొనే తత్వం రిషభ్లో కనిపించింది. చాలా సందర్భాల్లో అతడు ప్రత్యర్థి కన్నా ముందున్నాడు. జట్టును నడిపించేందుకు తనవైన దారులు వెతికాడు. అతడు భవిష్యత్తు సారథుల్లో ఒకరు. అందులో సందేహమే లేదు. ప్రతిభకు అవకాశం వచ్చినప్పుడు.. వినియోగించుకోవడానికి కావాల్సిన టెంపర్మెంట్ అతడిలో ఉంది’ అని సన్నీ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?