T20 World Cup: పాక్తో మ్యాచ్పై అభ్యంతరాలు.. మ్యాచ్ ఆడొద్దన్న కేంద్రమంత్రి!
కేంద్రమంత్రి రామ్దాస్ అఠావలే సైతం పాకిస్థాన్తో మ్యాచ్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కశ్మీర్లోని పరిస్థితుల దృష్ట్యా పాక్తో క్రికెట్ మ్యాచ్లు ఉండకపోవచమే మంచిదని పేర్కొన్నారు.....
దిల్లీ: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టీ20 ప్రపంచకప్ సందడి మొదలైంది. క్వాలిఫైయింగ్, వార్మప్ మ్యాచ్లు కొనసాగుతున్నాయి. అయితే భారత్లో అసలుసిసలైన క్రికెట్ మజా ఈనెల 24న మొదలుకానుంది. చిరకాల ప్రత్యర్థి పాక్తో టీమిండియా ఆరోజే తలపడనుంది. అయితే ఈ మ్యాచ్పై భారత్లో అభ్యంతరాలు మొదలయ్యాయి. సరిహద్దుల్లో పాకిస్థాన్ దుశ్చర్యల వల్ల భారత సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే ఆ దేశంతో టీ20 ఆడతారా? అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోదీని ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే సైతం పాకిస్థాన్తో మ్యాచ్పై స్పందించారు. ప్రస్తుతం కశ్మీర్లోని పరిస్థితుల దృష్ట్యా పాక్తో క్రికెట్ మ్యాచ్లు ఆడకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు.
ఓ జాతీయ మీడియాతో అథవాలే మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ఆగడాలను అణిచివేసేందుకు భారత ప్రభుత్వం ఆ దేశంపై యుద్ధం ప్రకటించాలి. పాక్తో మంచి సంబంధాలు కొనసాగించాలని భారత ప్రభుత్వం, ప్రధాని భావిస్తున్నప్పటికీ.. వారి ఉగ్ర చర్యలు ఆగడంలేదు. ఆ దేశంపై అంతిమ యుద్ధం ప్రకటించాలి. ప్రస్తుతం పాక్తో టీ20 మ్యాచ్ను నిలిపివేయాలి. ఈ విషయంపై ప్రభుత్వంతో మాట్లాడతా’ అని వ్యాఖ్యానించారు.
దాడులు ఆగేంతవరకు మ్యాచ్లు నిర్వహించకూడదు
దాయాది దేశంతో మ్యాచ్పై ఆమ్ ఆద్మీ పార్టీ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్థాన్తో మ్యాచ్ ఆడేందుకు టీమిండియా నిరాకరించాలని ఆప్ మహిళా ఎమ్మెల్యే అతిషీ కోరారు. భారత్లో పాక్ ఉగ్రదాడులు ఆగిపోయేంతవరకు ఆ దేశంతో క్రికెట్ మ్యాచ్లు ఉండకూడదని డిమాండ్ చేశారు. భాజపా సర్కారు, ప్రధాని మోదీ సైతం తన డిమాండ్కు మద్దతిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.
నిరాకరించే వీలులేదు.. మ్యాచ్ ఆడాల్సిందే!
పాక్తో మ్యాచ్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సోమవారం మాట్లాడిన విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే టోర్నమెంట్లో.. ఏ జట్టుకు కూడా మరొక జట్టుతో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించే వీలుఉండదన్నారు. టీ20 ప్రపంచకప్లో భారత్ ప్రధాన ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)