పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ ఔటైన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుదురుకున్న హిట్మ్యాన్ అనవసర షాట్కు..
విమర్శలపై స్పందించిన హిట్మ్యాన్
బ్రిస్బేన్ : బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ ఔటైన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుదురుకున్న హిట్మ్యాన్ అనవసర షాట్కు ప్రయత్నించి ఔటవ్వడం విస్మయానికి గురిచేసిందని మాజీలు సునీల్ గావస్కర్, సంజయ్మంజ్రేకర్, ఆకాశ్ చోప్రా విమర్శించారు. అది బాధ్యతారాహిత్యమైన షాట్ అని విశ్లేషించారు. సామాజిక మాధ్యమాల్లోనూ రోహిత్ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అయితే తనపై వస్తున్న విమర్శలకు రోహిత్ బదులిచ్చాడు. ఆ షాట్ ఆడినందుకు పశ్చాత్తాపం లేదని అన్నాడు. గతంలో అదే టెక్నిక్తో విజయవంతంగా బౌండరీలు సాధించిన సందర్భాలను గుర్తుచేశాడు. బౌలర్లపై ఒత్తిడి తెచ్చేందుకు అలాంటి షాట్లు ఆడతానని, ఇకపై కూడా కొనసాగిస్తానని తెలిపాడు. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం రోహిత్ మీడియా సమావేశంలో మాట్లాడాడు.
‘‘ఆ షాట్ ఆడినందుకు పశ్చాత్తాపం పడట్లేదు. బౌలర్లపై ఒత్తిడి పెంచడానికి అలాంటి షాట్లు ఆడతాను. లైయన్ తెలివైన బౌలర్. కష్టతరమైన బంతుల్ని విసురుతున్నాడు. అయితే అదే టెక్నిక్తో గతంలో ఎన్నో సార్లు విజయవంతమయ్యాను. కొన్నిసార్లు బంతి బౌండరీ అవతల పడవచ్చు. మరికొన్ని సార్లు ఔట్ అవ్వొచ్చు. దురదృష్టవశాత్తు ఈ సారి ఔటయ్యాను. ఏదేమైనా అలాంటి షాట్లు కొనసాగిస్తాను. అయితే నాపై జట్టు ఎంతో నమ్మకం ఉంచింది. దానికి తగ్గట్లుగా ఆడటం నా బాధ్యత. విమర్శల గురించి ఆలోచించను. నా దృష్టంతా ఆటపైనే ఉంటుంది’’ అని రోహిత్ అన్నాడు.
గబ్బా మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 369 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత్ 11 పరుగులకే గిల్ (7) వికెట్ను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన పుజారాతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయితే అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్న హిట్మ్యాన్ 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. లైయన్ వేసిన 20వ ఓవర్ అయిదో బంతికి మిడ్-ఆన్లో భారీషాట్కు ప్రయత్నించాడు. అయితే టైమింగ్ కుదరకపోవడంతో స్టార్క్ చేతికి చిక్కాడు. దీంతో అనవసర దూకుడుతో రోహిత్ ఆసీస్కు వికెట్ సమర్పించుకున్నాడని విమర్శలు వస్తున్నాయి.
ఇదీ చదవండి
రోహిత్ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!