Kohli - Ganguly: నో కామెంట్స్‌.. ఆ విషయాన్ని బీసీసీఐ చూసుకుంటుంది: గంగూలీ

వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విరాట్ కోహ్లీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ నిరాకరించాడు. ఆ విషయాన్ని బీసీసీఐ చూసుకుంటుందని చెప్పాడు. గత..

Updated : 16 Dec 2021 19:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విరాట్ కోహ్లీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ నిరాకరించాడు. ఆ విషయాన్ని బీసీసీఐ చూసుకుంటుందని చెప్పాడు. గత కొద్ది రోజులుగా టీమ్‌ఇండియాను వన్డే కెప్టెన్సీ వివాదం ఊపేస్తోన్న విషయం తెలిసిందే. తనతో ఎలాంటి ముందస్తు చర్చలు జరపకుండానే కెప్టెన్సీ నుంచి తప్పించారని ఇటీవల విరాట్ కోహ్లీ ప్రకటించడంతో ఈ వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. ఈ నేపథ్యంలో కోహ్లీ వ్యాఖ్యలపై స్పందించేందుకు గంగూలీ నిరాకరించడం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్న గంగూలీతో.. అక్కడి స్ధానిక మీడియా వన్డే కెప్టెన్సీ వివాదం గురించి ప్రస్తావించగా..‘నో స్టేట్‌మెంట్స్‌, నో ప్రెస్ కాన్ఫరెన్స్‌. ఈ విషయాన్ని బీసీసీఐ చూసుకుంటుంది’అని అన్నాడు. 

వన్డే కెప్టెన్సీ వివాదంపై స్పష్టతనిచ్చేందుకు తొలుత సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్‌ శర్మతో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని బీసీసీఐ భావించింది. అయితే, తర్వాత ఏం నిర్ణయించుకుందో తెలియదు కానీ ఈ వివాదంపై ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని