MS Dhoni: ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు : బాలాజీ
టీమ్ఇండియా మాజీ దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మాజీ బౌలర్ లక్ష్మిపతి బాలాజీ అన్నాడు. జట్టులో ఉన్నంత కాలం..
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా మాజీ దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మాజీ బౌలర్ లక్ష్మిపతి బాలాజీ అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 సీజన్ మెగా వేలానికి సంబంధించి.. సీఎస్కే ఫ్రాంఛైజీ రిటెయిన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించడానికి వచ్చిన బాలాజీ పలు విషయాలు వెల్లడించాడు.
‘ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. చెన్నై జట్టుకి ఆడుతున్నంత కాలం అతడు కెప్టెన్గా కొనసాగుతాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ని రిటెయిన్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతడి శక్తి సామర్థ్యాలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మా జట్టులో కీలక ఆటగాడు. టీమ్ఇండియా తరఫున, చెన్నై జట్టు తరఫున అతడు ఇప్పటికే చాలా సార్లు తన సామర్థ్యమేంటో నిరూపపించుకున్నాడు. అవసరమైన సమయంలో బంతితో పాటు, బ్యాటుతోనూ గొప్పగా రాణించగలడు. మొయీన్ అలీని రిటెయిన్ చేసుకోవడంతో జట్టుకి సమతూకం వచ్చింది. అటు ఆఫ్ స్పిన్ బౌలర్గానూ, ఇటు ఎడమ చేతి వాటం బ్యాటర్గానూ అలీ పనికొస్తాడు. రాబోయే సీజన్ కోసం ఎదురు చూస్తున్నాం’ అని బాలాజీ పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా, సీఎస్కే యాజమాన్యం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాని మొదటి ప్రాధాన్య ఆటగాడిగా, ధోనిని రెండో ప్రాధాన్య ఆటగాడిగా ఎంచుకుంది. ఈ నిర్ణయంతో ధోని కంటే జడేజా రూ.4 కోట్లు ఎక్కువగా అందుకోనున్నాడు. జడేజాకు రూ.16 కోట్లు, ధోనికి రూ.12 కోట్లు దక్కనున్నాయి. మొయీన్, రుతురాజ్లకు వరుసగా రూ.8 కోట్లు, రూ.6 కోట్లు లభించనున్నాయి.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు