Novak Djokovic: జకోవిచ్కు ఊరట.. ఆస్ట్రేలియాపై కేసు గెలిచిన టెన్నిస్ దిగ్గజం
టెన్నిస్ ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్కు ఉపశమనం కలిగింది. ఆస్ట్రేలియా కోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. సుదీర్ఘ విచారణ అనంతరం అతడిని వెంటనే క్వారంటైన్...
ఇంటర్నెట్డెస్క్: టెన్నిస్ ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్కు ఊరట కలిగింది. ఆస్ట్రేలియా కోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. విచారణ అనంతరం అతడిని వెంటనే క్వారంటైన్ డిటెన్షన్ సెంటర్ నుంచి విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే అతడి వీసాను కూడా పునరుద్ధరించాలని తెలిపింది. ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో పాల్గొనేందుకు ఈ సెర్బియన్ ఆటగాడు గత బుధవారం మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, అతడి వద్ద వాక్సినేషన్కు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా బోర్డర్ ఫోర్స్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే జకోవిచ్ను ఆస్ట్రేలియాలోకి అనుమతించకుండా వీసాను రద్దు చేయడంతో పాటు డిటెన్షన్ సెంటర్లో ఉంచారు.
ఈ విషయంపై న్యాయ పోరాటం చేసిన జకోవిచ్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో పాల్గొనేందుకు తనకు ప్రత్యేకమైన వైద్యపర మినహాయింపులు ఉన్నాయని చెప్పాడు. ఈ క్రమంలోనే గతనెల 16న కరోనా బారిన పడ్డానని, తర్వాత కోలుకొని వైద్య మినహాయింపు పొందానని తన లాయర్ల ద్వారా కోర్టుకు విన్నవించాడు. సోమవారం విచారణ జరిపిన జడ్జి ఆంటోనీ కెల్లీ చివరికి అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా మెల్బోర్న్ విమానాశ్రయంలో జకోవిచ్తో అధికారులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు. అతడి వస్తువులు తిరిగివ్వాలని, వెంటనే డిటెన్షన్ సెంటర్ నుంచి తరలించాలని ఆదేశించారు. ఇప్పటికే 20 గ్రాండ్స్లామ్లతో కొనసాగుతోన్న ఈ దిగ్గజ ఆటగాడు ఈ ఆస్ట్రేలియా ఓపెన్లో విజయం సాధించి కొత్త రికార్డు నెలకొల్పాలని చూస్తున్నాడు. అయితే, జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడతాడో.. లేదా? తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!