Djokovic : వ్యాక్సిన్పై నమ్మకం లేని జకోవిచ్కు బయోటెక్ కంపెనీలో వాటాలు?
కొవిడ్ వ్యాక్సినేషన్ వ్యవహారంతో ఏకంగా ఆస్ట్రేలియా ఓపెన్కు దూరమైన...
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ వ్యాక్సినేషన్ వ్యవహారంతో ఏకంగా ఆస్ట్రేలియా ఓపెన్కు దూరమైన ప్రపంచ నంబర్వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ గురించి మరో సంచలన విషయం బయటపడింది. కొవిడ్ వ్యాక్సిన్ పనితీరుపై నమ్మకం లేదని గతంలో జకోవిచ్ చెప్పడం గుర్తుంది కదా.. అలాంటి జకోవిచ్ కరోనాకు ఔషధం అభివృద్ధి చేసే సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ బయోటెక్ కంపెనీ సీఈవో వెల్లడించారు. ‘‘అవును కంపెనీ వ్యవస్థాపకుల్లో జకోవిచ్ ఒకడు. 2020 జూన్లో సంస్థను ప్రారంభించాం’’ అని క్వాంట్బయోరిస్ (QuantBioRes) సీఈవో ఐవాన్ లాంకేర్విక్ తెలిపారు. జకోవిచ్తోపాటు అతడి భార్య జెలెనా జంటకు సంస్థలో 80 శాతం వాటా ఉన్నట్లు సమాచారం. క్వాంట్బయోరిస్ సంస్థకు డెన్మార్క్, స్లొవేనియా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లోని 20 ప్రాంతాల్లో కార్యాలయాలు ఉండటం గమనార్హం.
‘‘వైరస్లపై పోరాడేందుకు, బ్యాక్టీరియాను ఎదుర్కొనేందుకు కొత్త సాంకేతికను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. దాని కోసం కొవిడ్ను ఓ ఉదాహరణగా పరిశోధనలు చేపట్టాం. మేం కరోనా వైరస్పై విజయవంతమైతే ఇతర వైరస్ల మీదా సక్సెస్ అయినట్లే. ఈ వేసవిలో యూకేలో క్లినికల్ పరీక్షలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం’’ అని సీఈవో వెల్లడించారు. అయితే బయోటెక్ సంస్థలో ఉన్న వాటాలపై స్పందించేందుకు నొవాక్ జకోవిచ్ అధికార ప్రతినిధి నిరాకరించారు. గత డిసెంబర్లో కరోనా బారిన పడటంతో వైద్యపరమైన మినహాయింపులు ఇవ్వాలని కోరినా.. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఫెడరల్ కోర్టుకు వెళ్లాడు. అయినా అక్కడా జకోవిచ్కు చుక్కెదురు కావడంతో ఇంటిముఖం పట్టక తప్పలేదు. అయితే కరోనా వచ్చినా క్వారంటైన్లో ఉండకుండా పలు కార్యక్రమాల్లో జకో పాల్గొన్నట్లు ఫొటోలు బయటకు రావడంతో ఒక్కసారి స్టార్ ఆటగాడిపై విమర్శలు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!