ODI WC 2023: ప్రపంచకప్ స్క్వాడ్ ఫైనలయ్యేది నేడే.. ఆ ఒక్కరు ఎవరు?
వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) జట్టులో మార్పులకు నేటితో గడువు ముగియనుంది. ఇప్పటికే భారత స్క్వాడ్ను వెల్లడించిన సంగతి తెలిసిందే.
వరల్డ్ కప్ సందడి షురూ అయింది. కొన్ని జట్లు ఇప్పటికే భారత్కు చేరుకున్నాయి. మరో వారం రోజుల్లో తొలి మ్యాచ్ జరగనుంది. శుక్రవారం నుంచి వార్మప్ మ్యాచ్లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే, అంతకంటే ముందు ముఖ్యమైన ప్రక్రియకు గడువు నేటితో తీరిపోనుంది. అదే ప్రపంచకప్ కోసం బరిలోకి దిగే స్క్వాడ్లో మార్పులు చేసుకొనే ఛాన్స్కు ఇవాళ లాస్ట్ డేట్. భారత్ జట్టులో ఒకరి ఎంపికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.
ఇప్పటికే భారత్ 15 మందితో కూడిన స్క్వాడ్ను ప్రపంచ కప్ కోసం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ ఫైనల్లో అక్షర్ పటేల్ గాయపడటంతోపాటు శ్రేయస్ అయ్యర్ ఫామ్పై కూడా అనుమానాలున్నాయి. కానీ, ఇప్పుడు శ్రేయస్ ఫామ్ అందిపుచ్చుకున్నాడు. ఇక అక్షర్ గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లోనూ ఆడలేదు. ఇప్పటికీ అతడు ఫిట్నెస్ అందుకోవడం కష్టమే అనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అక్షర్ స్థానాన్ని మరొకరితో భర్తీ చేయాల్సి ఉంది. దాని కోసం అశ్విన్, సుందర్ సిద్ధంగా ఉన్నారు. వారు ఆసీస్తో వన్డే సిరీస్లో ఆడారు. ఇద్దరూ ఆల్రౌండర్లే. కానీ అశ్విన్ అనుభవజ్ఞుడు.
అశ్విన్కేనా అవకాశం..
దాదాపు ఏడాదిన్నర తర్వాత వన్డేల్లోకి అడుగు పెట్టిన అశ్విన్ ఎలా ఆడతాడు? అనే అనుమానం తొలుత అందరిలో నెలకొంది. కానీ, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ తొలి రెండు వన్డేల్లో నాలుగు వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు. బ్యాటర్లను నియంత్రించాడు. అంతేకాదు.. గతంలో మెరుగైన బ్యాటింగ్ రికార్డు ఉండటంతో అశ్విన్ ఎంపిక లాంఛనమే అని అనుకున్నారు. అనూహ్యంగా ఆసీస్తో మూడో వన్డేలో అశ్విన్కు విశ్రాంతినిచ్చి వాషింగ్టన్ సుందర్ను బరిలోకి దింపింది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై ఆసీస్ భారీ స్కోరు చేసింది. అయినా, సుందర్ మాత్రం బౌలింగ్లో వికెట్ తీయకపోయినా కట్టుదిట్టంగానే బంతులను సంధించాడు. ఈ క్రమంలోనే అభిమానుల్లో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. అయితే, మూడో మ్యాచ్ తర్వాత వాషింగ్టన్ సుందర్ ఆసియా గేమ్స్లో పాల్గొనేందుకు చైనాకు వెళ్తాడు. సీనియారిటీకి చోటు కల్పించాలని భావిస్తే మాత్రం రవిచంద్రన్ అశ్విన్ వైపే టీమ్ఇండియా మేనేజ్మెంట్ మొగ్గుచూపే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకుల అంచనా.
వీరి స్థానాలకు తిరుగులేదు
భారత స్క్వాడ్లో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా స్థానాలు ఖాయమైనట్లే. ఆస్ట్రేలియాతో సిరీస్లో వీరంతా రాణించారు. ఆరంభంలో అయ్యర్ ఆటతీరుపైనే అనుమానాలు ఉండేవి. కానీ, రెండోవన్డేతోపాటు చివరి మ్యాచ్లోనూ నిలకడైన ఆటతీరుతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. సూర్య కూడా వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదేశాడు. మిడిలార్డర్లో కీలకంగా మారాడు. పేస్ దళం బుమ్రా నేతృత్వంలోనే నడవనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IND vs SA: ముందుంది సఫారీ సవాల్.. ఈసారి జెండా పాతుతారా?
దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు టీమ్ఇండియా (IND vs SA) సిద్ధమవుతోంది. అయితే, టెస్టు సిరీస్ను ఎలాగైనా నెగ్గాలనే లక్ష్యంతో ఈసారి బరిలోకి దిగబోతోంది. -
ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. అగ్రస్థానానికి దూసుకొచ్చిన భారత యువ స్పిన్నర్
టీమ్ఇండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. -
Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీని ఇష్టపడటానికి కారణమదే: బ్రెండన్ మెక్కల్లమ్
వన్డే ప్రపంచ కప్లో భారత్ను ఫైనల్కు చేర్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) దూకుడైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటాడని ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ వ్యాఖ్యానించాడు. -
Deepak Chahar: ఆయన్ను సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాం: దీపక్ చాహర్
వైద్యపరమైన అత్యవసర పరిస్థితి కారణాలతో దీపక్ చాహర్ (Deepak Chahar) ఆసీస్తో ఐదో టీ20లో ఆడలేదు. దీంతో అభిమానులంతా ఏమైందోనని కంగారు పడ్డారు. దానికి దీపక్ చాహర్ స్పందించాడు. -
IND vs SA: దక్షిణాఫ్రికాతో సిరీస్.. వారిద్దరి మధ్య డైరెక్ట్ షూటౌట్: భారత మాజీ క్రికెటర్
భారత జట్టులో (Team India) ఓపెనర్లకు కొదవేం లేదు. అయితే, తుది జట్టులో ఎవరికి స్థానం దక్కుతుందనేది ఆసక్తికరం. టీ20 వరల్డ్కప్లో రోహిత్ కెప్టెన్సీ చేపడతాడని తెలుస్తోంది. దీంతో అతడికి జోడీగా ముగ్గురు ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అందులోనూ ఇద్దరికి దక్షిణాఫ్రికాతో సిరీస్ అత్యంత కీలకం కానుంది. -
Lionel Messi: టైమ్ మ్యాగజైన్ ‘అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’గా మెస్సీ
ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. టైమ్ పత్రిక అతడిని ఈ ఏడాది అత్యుత్తమ అథ్లెట్గా ప్రకటించింది. -
Team India: ధోనీలాంటి కెప్టెనే రోహిత్.. వారికి ఎల్లవేళలా అండగా ఉంటాడు: శ్రీశాంత్
వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2024) భారత్ను ఫైనల్కు చేర్చిన రోహిత్ శర్మ నాయకత్వంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి కెప్టెన్సీని ధోనీతో పోలుస్తూ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
T20 WC 2024: టీ20 ప్రపంచకప్లో రోహితే సారథి!
వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మెగా టోర్నీలో జట్టును నడిపించడానికి రోహితే సరైన వ్యక్తని కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్లు సహా బీసీసీఐలో అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. -
INDw vs ENGw: భారత అమ్మాయిలకు సవాల్
భారత మహిళల క్రికెట్ జట్టుకు సవాల్.. బలమైన ఇంగ్లాండ్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ జరిగేది బుధవారమే. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్.. ఈ ఏడాది టీ20ల్లో మెరుగైన ప్రదర్శనే చేసింది. ఈ ఫార్మాట్లో ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలవడమే కాదు.. -
Pro Kabaddi League: విజృంభించిన సోను
రైడర్ సోను జగ్లాన్ (10 పాయింట్లు) అదరగొట్టడంతో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో గుజరాత్ జెయింట్స్ హ్యాట్రిక్ సాధించింది. జోరు కొనసాగిస్తూ మంగళవారం 39-37లో యు ముంబాపై విజయం సాధించింది. మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతూ సాగిన ఈ పోరులో ఆరంభంలో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. -
junior hockey wc: అర్జీత్ హ్యాట్రిక్
జూనియర్ హాకీ ప్రపంచకప్లో భారత్కు అదిరే ఆరంభం. అర్జీత్ సింగ్ హుందాల్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో మంగళవారం పూల్-సి మ్యాచ్లో 4-2తో కొరియాను ఓడించింది. ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి భారత్దే జోరు. 11వ నిమిషంలో అర్జీత్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. -
భారత్కు మూడు స్వర్ణాలు
ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పాయల్, నిషా, ఆకాన్ష పసిడి పతకాలతో మెరిశారు. అర్మేనియాలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల 52 కేజీల ఫైనల్లో నిషా 5-0తో ఫరినాజ్ (తజికిస్థాన్)ను చిత్తుగా చేయగా..70 కేజీల తుదిపోరులో ఆకాన్ష అంతే తేడాతో తైమజోవా (రష్యా)ను ఓడించింది. -
Sourav Ganguly: కోహ్లీని నేను తప్పించలేదు
టీమ్ఇండియా టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లీని తప్పించడంలో తన పాత్రేమీ లేదని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పునరుద్ఘాటించాడు. టీ20 ప్రపంచకప్ (2021) అనంతరం కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అతడికి, గంగూలీకి మధ్య వైరం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్, ఆంధ్ర నిష్క్రమణ
విజయ్ హజారె ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ నుంచి హైదరాబాద్, ఆంధ్ర నిష్క్రమించాయి. పేలవ ప్రదర్శనతో గ్రూపు దశను దాటలేకపోయాయి. ఏడు మ్యాచ్ల్లో నాల్గింట్లో గెలిచి.. మూడింట్లో ఓడిన హైదరాబాద్ 16 పాయింట్లతో గ్రూపు-బి పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. -
Sports News: ఆ ఒక్క అథ్లెట్ డోపీనే
ఈ ఏడాది సెప్టెంబరులో సంచలనం సృష్టించిన దిల్లీ అథ్లెటిక్ మీట్లో మరో విచిత్రం చోటు చేసుకుంది. 100 మీటర్ల పరుగులో పాల్గొన్న ఏకైక అథ్లెట్ కూడా డోపీగా తేలాడు. సెప్టెంబరు 26న 100 మీ ఫైనల్ నిర్వహిస్తున్న సమయంలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అధికారులు వస్తున్నారని తెలియడంతో ఒక్కరు మినహా బరిలో ఉన్న అథ్లెట్లంతా పారిపోయారు. -
IPL 2024 mini auction: ‘ఆ ఇద్దరి కోసం ముంబయి ఇండియన్స్ పోటీ పడుతోంది’
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-2024 సీజన్ కోసం మినీ వేలం నిర్వహించనున్నారు. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హేజిల్వుడ్ ఈ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది.


తాజా వార్తలు (Latest News)
-
ఖాసీం సులేమానీ హత్యకు 50 బిలియన్ల డాలర్లు చెల్లించండి..అమెరికాకు ఇరాన్ కోర్టు ఆదేశం
-
Chhattisgarh: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 80శాతం కోటీశ్వరులే..
-
Wikipedia: వికీపీడియాలో భారత్ హవా..!
-
Nimmagadda: నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి.. గవర్నర్కు నిమ్మగడ్డ వినతి
-
Elon Musk: మస్క్ను తండ్రే లూజర్ అన్నవేళ..వెలుగులోకి సంచలన విషయాలు
-
Hyderabad: రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం.. 7న ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు