75th Independence Day: లండన్‌లో భారత జెండాను ఎగురవేసిన కోహ్లీ

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్వీ లండన్‌లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా అక్కడ పర్యటిస్తున్న భారత జట్టు అక్కడే....

Updated : 15 Aug 2021 17:04 IST

లండన్‌: భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లండన్‌లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా అక్కడ పర్యటిస్తున్న భారత జట్టు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంది. ఈ కార్యక్రమంలో టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి, ఆటగాళ్లతో పాటు సపోర్ట్‌ స్టాఫ్‌ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఆటగాళ్ల కుటుంబసభ్యులు హాజరుకావడం విశేషం. విరాట్‌ జెండాను ఆవిష్కరించిన అనంతరం అందరూ జాతీయ గీతం ఆలపించారు. ఈ వీడియోను బీసీసీఐ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని