Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
ప్రస్తుత భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit sharma) సీనియర్లు. అయితే ఇటీవల కొన్ని టీ20 మ్యాచుల్లో వీరిద్దరూ లేకుండానే భారత్ మ్యాచ్లను ఆడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: గతేడాది పొట్టి ప్రపంచకప్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 మ్యాచ్లను ఆడటం లేదు. టీమ్ మేనేజ్మెంట్ యువకులకు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ వస్తోంది. హార్దిక్ పాండ్య నాయకత్వంలో ‘మిషన్ 2024’ కోసం టీమ్ఇండియా సమాయత్తమవుతోంది. అయితే సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను టీ20ల్లో ఆడించాలని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సూచించాడు.
‘‘కేఎల్ రాహుల్ వంటి ఆటగాడికి ప్రత్యామ్నాయం వెతకడం సులువే. కానీ రోహిత్, కోహ్లీ వంటి ఆటగాళ్లకు రిప్లేస్మెంట్ చేయడం కష్టం. శుభ్మన్ గిల్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్ మంచి ఆటగాళ్లే. భవిష్యత్తులో స్టార్ ప్లేయర్ల స్థానాలకు ఎదగగలరు. అయితే వీరంతా ఒకే తరహా ఆటగాళ్లు. ఒకే అనుభవం ఉంది. వీరు వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు జట్టును తీసుకెళ్లగలరా..? ఆటపరంగా అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. కానీ అనుభవలేమి అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ప్రపంచకప్వంటి మెగా టోర్నీల్లో అనుభవం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. న్యూజిలాండ్తో తొలి టీ20 మ్యాచ్నే ఉదాహరణగా తీసుకోండి.. వీరంతా యువకులకు కావడంతో సీనియర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఒకవేళ సీనియర్లు రోహిత్, విరాట్.. ఇలా వారిలో ఒక్కరు ఉన్నా సరే ఫలితం మరోలా ఉండేది. అందుకే రాహుల్ ద్రవిడ్, హార్దిక్ పాండ్యకు నేను సూచించే విషయం ఒక్కటే. రోహిత్, విరాట్కు అవకాశం కల్పించాలి. కనీసం వీరిద్దిరిలో ఒక్కరినైనా తుది జట్టులో ఆడించాలి’’ అని లతీఫ్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WPL 2024 - RCB: డబ్ల్యూపీఎల్ విజేతగా ఆర్సీబీ.. పురుషుల జట్టుపై నెట్టింట మీమ్స్!
ఆర్సీబీ మహిళా జట్టు విజేతగా నిలవడంతో పురుష టీమ్పై సోషల్ మీడియాలో కామెంట్లు ఎక్కువయ్యాయి. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఛాంపియన్గా ఆర్సీబీ నిలిచింది. -
WPL 2024: ఈ కప్ వారి కోసమే.. మాటలు రావడం లేదు: స్మృతి మంధాన
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి ఛాంపియన్గా నిలిచింది. -
IPL 2024: గిల్ కెప్టెన్గా సక్సెస్ అవుతాడు.. మేం అండగా ఉంటాం: గ్యారీ కిర్స్టెన్
కొత్త సారథి నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఈసారి ఐపీఎల్ (IPL 2024) బరిలోకి దిగింది. తొలి మ్యాచ్లో హార్దిక్ కెప్టెన్సీలోని ముంబయి ఇండియన్స్తో తలపడనుండటం గమనార్హం. గత రెండు సీజన్లలో హార్దిక్ గుజరాత్ను నడిపించిన సంగతి తెలిసిందే. -
Mohammad Kaif: వాళ్లిద్దరి జోక్యం వల్లే భారత్ ఓటమి
పిచ్ విషయంలో కెప్టెన్ రోహిత్శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ జోక్యమే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమికి కారణమని టీమ్ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అన్నాడు. -
బెంగళూరుకు ఓ కప్పు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. -
బెంగ తీరింది
ఈ సాలా కప్ నమదే! అవును.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించింది. కల లాంటి కప్ను దక్కించుకుంది. -
ఈసారి తేలిక కాదు!
ఐపీఎల్లో గుజరాత్ అరంగేట్రమే పెను సంచలనం. లఖ్నవూతో పాటు 2022లో టోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్టు.. తొలి సీజన్లోనే విజేతగా నిలిచి ఔరా అనిపించింది. -
5 రోజుల్లో తిరిగొస్తానని చెప్పా
నిరుడు ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో మ్యాచ్ నుంచి గాయం కారణంగా అర్ధంతరంగా వైదొలిగిన భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. అప్పుడు అయిదు రోజుల్లోనే జట్టులోకి తిరిగొస్తానని టీమ్ఇండియా మేనేజ్మెంట్కు మాటిచ్చాడట. -
స్వదేశానికి కోహ్లి
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్వదేశానికి చేరుకున్నాడు. కుమారుడు అకాయ్ పుట్టిన తర్వాత తొలిసారిగా కోహ్లి ఆదివారం భారత్కు తిరిగొచ్చాడు. -
కోహ్లి కావాల్సిందేనన్న రోహిత్!
ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో విరాట్ కోహ్లి ఉండాల్సిందేనని బీసీసీఐ కార్యదర్శి జై షాకు కెప్టెన్ రోహిత్ తేల్చిచెప్పినట్లు మాజీ ఆల్రౌండర్ కీర్తి ఆజాద్ పేర్కొనడం సంచలనంగా మారింది. -
పాక్ కోచ్ పదవికి వాట్సన్ తిరస్కారం
పాకిస్థాన్ జట్టు చీఫ్ కోచ్ పదవిని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ తిరస్కరించినట్లు సమాచారం. -
Kuldeep Yadav: మైదానంలో రోహిత్ ఏమన్నా మేం బాధపడం: కుల్దీప్ యాదవ్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో దురుసుగా ఉంటాడనే కామెంట్లను కుల్దీప్ యాదవ్ కొట్టిపడేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
Adani group: నష్టాల్లో అదానీ గ్రూప్ స్టాక్స్.. అమెరికా దర్యాప్తు ఎఫెక్ట్
-
Jio - IPL: ఐపీఎల్ సందడి.. జియో యూజర్లకు డేటా ప్యాక్లు
-
Nadendla Manohar: బొప్పూడి సభలో పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోంది: నాదెండ్ల మనోహర్
-
Maldives Parliament Elections: మాల్దీవుల్లో ఎన్నికలు.. భారత్కు బ్యాలెట్ బాక్సులు..!
-
BRS: దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కలిసిన భారాస నేతలు
-
Elvish Yadav: పాము విషం ఏర్పాటు చేశా.. కీలక విషయాలు వెల్లడించిన బిగ్బాస్ ఓటీటీ విజేత..!