Mirabai Chanu: శిష్యురాలి విజయం.. కుంజరాణి దేవి ఆనందం..
టోక్యో ఒలింపిక్స్ మహిళల వెయిట్ లిఫ్టింగ్లో భారత్కు తొలి పతకం అందించిన మీరాబాయి చాను విజయం పట్ల ఆమె గురువు కుంజరాణి దేవి (53) హర్షం వ్యక్తం చేశారు. మీరా దేశం గర్వపడేలా చేసిందని ప్రశంసించారు....
దిల్లీ: టోక్యో ఒలింపిక్స్ మహిళల వెయిట్ లిఫ్టింగ్లో భారత్కు తొలి పతకం అందించిన మీరాబాయి చాను విజయం పట్ల ఆమె గురువు కుంజరాణి దేవి (53) హర్షం వ్యక్తం చేశారు. మీరా దేశం గర్వపడేలా చేసిందని ప్రశంసించారు. ప్రపంచ ఛాంపియన్షిప్లో ఏడుసార్లు రజతం గెలిచిన కుంజరాణి దేవి ఎందరో యువ వెయిట్ లిఫ్టర్లకు ఆదర్శప్రాయం. అయితే ఒలింపిక్స్ పతకం ఆమెకు కలగానే మిగిలిపోయింది. అయితే ఆ కలను తన శిష్యురాలు నిజం చేయడంతో కుంజరాణి గర్వం వ్యక్తం చేశారు. గురువుగా చానులోని చిన్నచిన్న లోపాలను మాత్రమే సవరించానని, ఎంతో కష్టపడుతూ.. తనను తాను రాటుదేల్చుకుంటూ ముందుకెళ్లిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీరాబాయి గురించి ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘2011లో జరిగిన జూనియర్ నేషనల్ క్యాంప్లో మీరాబాయిని మొదటిసారి చూశా. అప్పుడే నేను ఆమెకు మొదటిసారి కోచ్గా వ్యవహరించా. ప్రతిభతోపాటు దృఢ సంకల్పం కలగలిసిన వ్యక్తి మీరా. అందరు అథ్లెట్ల కంటే ఆమె ఎంతో భిన్నం. కోచ్లు ఏది చెబితే దాన్ని తూచా తప్పకుండా పాటించేది. ఆమెలోని చిన్న లోపాలను మాత్రమే సవరించేందుకు నేను సహాయపడ్డా. ఒలింపిక్ ఛాంపియన్గా ఎదగాలన్నా.. అర్జున, రాజీవ్గాంధీ ఖేల్రత్న లాంటి అవార్డులు సాధించాలన్నా ఎంతో కష్టపడాలని ఆమెకు సూచించేదాన్ని. చాను ఆటలోని నాణ్యతే ఈ రోజు ఆమె ఒలింపిక్స్లో పతకం సాధించేందుకు కారణం’ అని పేర్కొన్నారు.
2017 రియో ఒలింపిక్స్లో పతకం సాధించలేకపోవడంతో నిరాశకు గురైన చాను తిరిగి అంతే వేగంగా పుంజుకుందని కుంజరాణి తెలిపారు.‘ఆమె నా దగ్గర 2015 వరకు శిక్షణ తీసుకుంది. రెండు ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆమె వెంట ఉన్నా. తన విజయాలను దగ్గరుండి చూశాను. చాను పోటీల్లో బిజీ కావడంతో 2018 నుంచి తనను కలవకపోయినా.. ఆమెను ఆశీర్వదిస్తూనే ఉండేదాన్ని. ఆమె సాధించిన ఈ విజయంలో కొంతమేర అయినా నా పాత్ర ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నా’ అని తెలిపారు.
‘రైల్వేలో విధులు నిర్వహిస్తూ.. వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో పాలుపంచుకుంటూనే చాను తన కుటుంబాన్ని పోషించింది. తన కాళ్లమీద తాను నిలబడి కుటుంబ బాగోగుల్ని చూసుకొంది. తన జీవితం కూడా నా జీవితంలాగే ఉండేది. అందుకే తన మీద కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టేదాన్ని. ఈ రోజు భారత దేశ గౌరవాన్ని తన భుజాల మీద ఎత్తుకొంది. కొవిడ్ కారణంగా నవ్వడాన్ని మర్చిపోయిన ప్రస్తుత తరుణంలో.. ఒక యువతి వల్ల దేశమంతా హర్షిస్తోంది. ఇందుకు ఎంతో గర్వంగా ఉంది.’ అని కుంజరాణి దేవి ఆనందం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM