మహిళల క్రికెట్కు మంచి రోజులు: నీతా అంబానీ
మన దేశంలో మహిళా క్రికెట్కు రానున్న రోజులు గొప్పగా ఉండనున్నాయని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఛైర్పర్సన్ నీతా అంబానీ అన్నారు. ఇండియా ఉమెన్స్ క్రికెట్ భవిష్యత్తుపై తాను ఆశావాద దృక్ఫథంతో ఉన్నట్లు ఆమె
దుబాయ్: మన దేశంలో మహిళా క్రికెట్కు రానున్న రోజులు గొప్పగా ఉండనున్నాయని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఛైర్పర్సన్ నీతా అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియా ఉమెన్స్ క్రికెట్ భవిష్యత్తుపై తాను ఆశావాద దృక్ఫథంతో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్లో ఫైనల్ చేరిన తన ముంబయి జట్టు అధికారిక ట్విటర్ ఖాతాలో సోమవారం నీతా అంబానీ వీడియో పోస్ట్ చేశారు. అందులో మహిళా క్రికెట్పై ఆమె మాట్లాడారు. టీంఇండియా ఉమెన్స్ జట్టులోని అమ్మాయిలు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అద్భుతంగా రాణిస్తున్నారని తెలపారు.
ప్రపంచ వేదికలపై మన అమ్మాయిలు మెరుస్తున్నారని పేర్కొన్నారు. గత ఆరేళ్లలో వన్డే, టీ20 ప్రపంచకప్ పోటీల్లో మన జట్టు ఆధిపత్యం చెలాయించిందని నీతా అంబానీ అన్నారు. అంజుమ్ చోప్రా, జులన్ గోస్వామి, మిథాలీ రాజ్ వంటి లెజెండ్స్ మహిళా క్రికెట్కు మార్గదర్శకులుగా నిలిచారని ఆమె వివరించారు. ప్రస్తుతం స్మృతి మంథాన, పూనమ్ యాదవ్, హర్మన్ ప్రీత్ కౌర్ జట్టును ముందుకు తీసుకెళ్తారని నీతా అంబానీ పేర్కొన్నారు. యూఏఈలో జరుగుతున్న ఉమెన్స్ టీ20 లీగ్లో సోమవారం ఫైనల్ మ్యాచ్ సూపర్ నోవాస్, ట్రయల్ బ్లేజర్స్కు మధ్య జరిగింది. ఈ నేపథ్యంలో నీతా అంబానీ మన దేశ మహిళా క్రికెటర్ల గురించి మాట్లాడారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో స్మృతి మంథాన సారథ్యంలోని ట్రయల్ బ్లేజర్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.