IND vs PAK:భారత్‌, పాక్‌ మ్యాచ్‌.. జట్టును ప్రకటించిన పాక్‌

అయిదేళ్ల విరామం తర్వాత.. పొట్టి క్రికెట్‌ మజాను మరోసారి అందించేందుకు తిరిగి వచ్చిన టీ20 ప్రపంచకప్‌లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచే సూపర్‌-12  మ్యాచ్‌లుప్రారంభంకానున్నాయి. శనివారం గ్రూప్‌- 1లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా.. రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌

Published : 23 Oct 2021 15:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అయిదేళ్ల విరామం తర్వాత.. పొట్టి క్రికెట్‌ మజాను మరోసారి అందించేందుకు తిరిగి వచ్చిన టీ20 ప్రపంచకప్‌లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచే సూపర్‌-12  మ్యాచ్‌లుప్రారంభంకానున్నాయి. శనివారం గ్రూప్‌- 1లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా.. రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌తో ఇంగ్లాండ్‌ తలపడనున్నాయి. ఇక, చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాక్‌ మధ్య మ్యాచ్‌ ఆదివారం రాత్రి జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌ కోసం పాక్‌ 12 మందితో జట్టుని ప్రకటించింది.

పాకిస్థాన్‌ జట్టు: బాబర్‌ అజామ్‌ (కెప్టెన్‌), ఆసిఫ్ అలీ, ఫకార్‌ జమాన్‌, హైదర్‌ అలీ, మహమ్మద్‌ రిజ్వాన్‌, వసీమ్‌, మహమ్మద్‌ హఫీజ్‌, షాదాబ్‌ఖాన్‌, షోయబ్‌ మాలిక్‌, హరిస్‌, హసన్‌ అలీ, షాహెన్‌ షా ఆఫ్రిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని