India vs Pak: ఉత్కంఠ పోరులో భారత్పై పాక్ విజయం
ఆసియాకప్లో భాగంగా సూపర్-4లో భారత్తో జరిగిన ఉత్కంఠ పోరులో పాక్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
దుబాయ్: ఆసియాకప్ సూపర్-4లో భారత్కు ఓటమి ఎదురైంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో టీమ్ఇండియాపై పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్ ఐదు వికెట్లను నష్టపోయి 19.5 ఓవర్లలో 182 పరుగులు చేసి విజయం సాధించింది. రిజ్వాన్ (71), నవాజ్ (42) కీలక పాత్ర పోషించారు. గెలుపు దిశగా పాక్ ఇన్నింగ్స్ సాగిన క్రమంలో రిజ్వాన్, నవాజ్ స్వల్ప తేడాతో ఔట్ కావడంతో భారత్ శిబిరంలో గెలుపు ఆశలు చిగురించాయి. అయితే చివరలో అసిఫ్ అలీ(16), ఖుష్దిల్(14 నాటౌట్) పాక్ను విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో భువనేశ్వర్, అర్ష్దీప్, హార్దిక్ పాండ్య, రవి బిష్ణోయ్, చాహల్ తలో వికెట్ తీశారు. గ్రూప్ స్టేజ్లో పాక్పై టీమ్ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే.
రాణించిన కోహ్లీ
ఓపెనర్లు కేఎల్ రాహుల్ (28), రోహిత్ (28) ధాటిగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. తొలి వికెట్కు అర్ధశతక భాగస్వామ్యం జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ పెవిలియన్కు చేరారు. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (13), రిషభ్ పంత్ (14)తో కలిసి విరాట్ కోహ్లీ(60) ఇన్నింగ్స్ను నిర్మించాడు. అయితే మరోసారి పంత్, హార్దిక్ (0) స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. దీపక్ హుడా (16) ధాటిగా ఆడే క్రమంలో పెవిలియన్కు చేరాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. విరాట్ మాత్రం చక్కగా ఆడాడు. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2.. నసీమ్ షా, నవాజ్, హారిస్, హస్నైన్ తలో వికెట్ తీశారు.
ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.