Pak Cricket: భారత్ మోడల్కు తొందరేం లేదు.. ముందు ఆ పని చూడండి.. పాక్కు మాజీ ప్లేయర్ సూచన
ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా.. మెగా టోర్నీల్లో చిత్తవకుండా ఉండేందుకు టీమ్ఇండియా (Team India) ఆటగాళ్లను రొటేషన్ పద్ధతిలో ఆడిస్తోంది. అంతేకాకుండా రోహిత్ శర్మను కాకుండా.. ఇటీవల ఎక్కువగా టీ20ల్లో హార్దిక్కు సారథ్య బాధ్యతలను అప్పగించింది. ఇలా వేర్వేరుగా జట్లను సిద్ధం చేసింది. ఇదే నమూనాను పాక్ కూడా చేయాలని పలువురు సూచించారు. కానీ ఆ జట్టు మాజీ ఆటగాడు మాత్రం అలా కాదంటూ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: మూడు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లు.. రెండు జట్లు.. ఇదీ టీమ్ఇండియా మోడల్. రోహిత్ శర్మ నాయకత్వంలో వన్టేలు, టెస్టులను ఆడే భారత్.. హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో టీ20లు ఆడుతోంది. ‘మిషన్ 2024’లో భాగంగా పాండ్యకు నాయకత్వ బాధ్యతలను మేనేజ్మెంట్ అప్పగించింది. భారత్ మోడల్ను అంతర్జాతీయంగా పలువురు మాజీ క్రికెటర్లు అభినందించారు. మరికొందరేమో అలా మార్పులు చేసుకుంటూ పోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే నమూనాను దాయాది దేశం పాకిస్థాన్ కూడా అవలంబించాలని ఆ జట్టు మాజీలు సూచించారు. అయితే పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ మాత్రం విభిన్నంగా స్పందించాడు. టీమ్ఇండియాను అభినందిస్తూనే పాక్ జట్టుకు చురకలు అంటించాడు.
‘‘ ఫస్ట్, మీరు మొదటి జట్టునే సరిగ్గా తయారు చేయండి. ఇలా దేశవాళీ క్రికెట్లో రెండు, మూడు టీమ్లను 2018-19 ముందు కూడా తయారు చేశారు. పాక్లో డొమిస్టిక్ క్రికెట్ చాలా సంపన్నమైంది. నేను చాలా ఏళ్లు ఆడాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు ఒక జట్టును తయారు చేయడమే పాక్ మేనేజ్మెంట్కు గగనంగా మారింది. ఆరు జట్లతో ప్రయోజనం ఉండి ఉంటే ఫవాద్ ఆలం చాలా సంవత్సరాల తర్వాత పునరాగమనం చేసేవాడే కాదు’’ అని కమ్రాన్ వ్యాఖ్యానించాడు.
పాక్ను గతేడాది ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ ఫైనల్స్కు తీసుకెళ్లడంలో ఆ జట్టు సారథి బాబర్ అజామ్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఇటీవల వరుసగా స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ల్లో ఘోర ఓటమితో తీవ్రంగా విమర్శలపాలయ్యాడు. గత సీజన్లో మొత్తం 8 టెస్టులను ఆడిన పాక్.. నాలుగింట్లో ఓడిపోయి, మరో నాలుగింటిని డ్రాగా చేసుకొంది. కనీసం ఒక్క మ్యాచ్ను గెలవలేక చతికిల పడిపోయింది. దీంతో బాబర్ అజామ్ కెప్టెన్సీపై వేటు వేయాలని, జట్టులో సమూల మార్పులు చేయాలనే డిమాండ్లు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్