PAK vs ENG: పాక్, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్.. 10 పాయింట్లలో
గతంలో ఎన్నడూ లేని విధంగా సంచలనాలు నమోదైన ఈ టీ20 ప్రపంచకప్ సమరం తుది దశకు చేరుకుంది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో పాకిస్థాన్, ఇంగ్లాండ్తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు మెల్బోర్న్క్రికెట్ మైదానం అతిథ్యం ఇవ్వనుంది. మరి గతంలో ఈ రెండు జట్ల ప్రదర్శన గురించి పది పాయింట్లలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: గతంలో ఎన్నడూ లేని విధంగా సంచలనాలు నమోదైన ఈ టీ20 ప్రపంచకప్ సమరం తుది దశకు చేరుకుంది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో పాకిస్థాన్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు మెల్బోర్న్క్రికెట్ మైదానం అతిథ్యం ఇవ్వనుంది. మరి గతంలో ఈ రెండు జట్ల ప్రదర్శన గురించి పది పాయింట్లలో తెలుసుకుందాం.
- ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్లు జరిగాయి. 18 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్, 9 మ్యాచ్ల్లో పాకిస్థాన్ విజయం సాధించాయి. ఒక దాంట్లో ఫలితం తేలలేదు.
- చివరి ఐదు మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ మూడుసార్లు విజయం సాధించగా.. పాక్ రెండింటిలో గెలుపొందింది. ప్రపంచకప్నకు ముందు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 7 టీ20 మ్యాచ్ల సిరీస్లో రెండో టీ20లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని పాక్ వికెట్ కోల్పోకుండా ఛేదించడం విశేషం.
- టీ20 ప్రపంచకప్లో ఈ ఇరుజట్లు రెండుసార్లు (2009, 2010) తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్ల్లోనూ ఇంగ్లాడే విజయం సాధించడం విశేషం.
- తొలి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 185/5 స్కోరు చేయగా.. లక్ష్యఛేదనలో పాక్ 137/7కే పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది.
- రెండో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 147/9 స్కోరు సాధించింది. ఈ లక్ష్యాన్నిఇంగ్లాండ్ 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
- పాక్పై ఇంగ్లాండ్ తరఫున అత్యధికంగా ఇయాన్ మోర్గాన్ (427) పరుగులు చేయగా.. అదిల్ రషీద్ (17) వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్పై పాకిస్థాన్ తరఫున అత్యధికంగా బాబర్ అజామ్ (560) పరుగులు చేయగా.. హారిస్ రవూఫ్ (14) వికెట్లు తీశాడు.
- టీ20ల్లో పాక్పై ఇంగ్లాండ్ అత్యధిక స్కోరు 221 కాగా.. అత్యల్ప స్కోరు 135. ఇంగ్లాండ్పై పాకిస్థాన్ అత్యధిక స్కోరు 232 కాగా.. అత్యల్ప స్కోరు 89.
- టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ ఫైనల్కి చేరుకోవడం ఇది మూడోసారి. 2007లో భారత్ చేతిలో ఓడి రన్నరప్గా నిలవగా.. 2009 ఫైనల్లో శ్రీలంకను మట్టికరిపించి టైటిల్ని ఎగరేసుకుపోయింది.
- పాకిస్థాన్ మూడుసార్లు సెమీస్కు చేరుకుంది. 2010, 2021లో ఆస్ట్రేలియాపై, 2012లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది.
- ఇంగ్లాండ్ కూడా ఫైనల్ చేరుకోవడం ఇది మూడోసారి. 2010లో ఆస్ట్రేలియాని ఓడించి విశ్వవిజేతగా నిలవగా.. 2016 ఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలై రన్నరప్గా నిలిచింది. 2021లోసెమీస్కు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్