IPL - 2022 : పాంటింగ్ కోచింగ్లో పంత్ మరింత రాటు దేలాడు : షేన్ వాట్సన్
దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్పై ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కోచింగ్లో పంత్ మరింత రాటు దేలాడని పేర్కొన్నాడు. చాలా చిన్న వయసులోనే ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడని..
(Photo : Delhi Capitals Twitter)
ఇంటర్నెట్ డెస్క్ : దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్పై ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కోచింగ్లో పంత్ మరింత రాటుదేలాడని పేర్కొన్నాడు. చాలా చిన్న వయసులోనే ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడని చెప్పుకొచ్చాడు.
‘రిషబ్ పంత్లోని నైపుణ్యం కారణంగానే అతడు నాయకుడిగా రాణించగలగుతున్నాడు. కేవలం 24 ఏళ్ల వయసులోనే ఎన్నో అపురూప ఘనతలు సాధించాడు. తనలోని లోపాలను అధిగమిస్తూ.. రోజు రోజుకీ మరింత మెరుగవుతున్నాడు. దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన రికీ పాంటింగ్ కోచింగ్లో పంత్ మరింత రాటుదేలాడు. పాంటింగ్లో జట్టుని సమర్థంగా నడిపించగల సామర్థ్యం, అందుబాటులో ఉన్న ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టగల నేర్పు ఉన్నాయి. రిషభ్కు కచ్చితంగా ఈ లక్షణం అలవడిందనుకుంటున్నాను. అయితే, దిల్లీ జట్టులో ఓ ఆటగాడిగా, కెప్టెన్గా పంత్ మెరుగ్గా రాణించడం అన్నింటి కంటే చాలా ముఖ్యం’ అని షేన్ వాట్సన్ అన్నాడు.
‘ఆటగాళ్లను ఒకరితో మరొకరిని పోల్చడం సరికాదు. ప్రతిఒక్క ఆటగాడిలో ప్రత్యేక నైపుణ్యాలు, సొంత సామర్థ్యాలు ఉంటాయి. ధోని, రిషభ్ పంత్ ఇద్దరూ భిన్నమైన వ్యక్తులు. ఇద్దరిలోనూ విభిన్న సామర్థ్యాలున్నాయి. కానీ, ధోనీలాగే రిషబ్ పంత్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు’ అని వాట్సన్ చెప్పాడు.
* ఆ ముగ్గురితో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నా..
టీమ్ఇండియా యువ ఆటగాళ్లు పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్, రిషభ్ పంత్లతో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నానని షేన్ వాట్సన్ అన్నాడు. ‘మా జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ గురించి తెలుసుకోవాలి. అతడు మెరుగ్గా రాణించేందుకు నా వంతు సహకారం అందిస్తాను. అలాగే, పృథ్వీ షాలో గొప్ప నైపుణ్యం ఉంది. అతడు బ్యాటింగ్ చేసే విధానం అద్భుతంగా ఉంటుంది. మరో ఆటగాడు శార్దూల్ ఠాకూర్తో ఇంతకు ముందే పరిచయం ఉంది. మేమిద్దరం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు తరఫున ఆడాం. ఇటీవల అతడు చాలా మెరుగ్గా రాణిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ఆల్ రౌండర్ స్థాయికి ఎదిగాడు. యువ ఆటగాళ్లతో మా జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో కచ్చితంగా టైటిల్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని వాట్సన్ అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్