Pat Cummins: మాజీ ఆటగాళ్లారా.. మీ అందరికీ ఒక క్లారిటీ..: ప్యాట్ కమిన్స్
ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్ పదివికి జస్టిన్ లాంగర్ రాజీనామా చేయడంపై ఆ జట్టు టెస్టు సారథి ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ఈ విషయంపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో...
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్ పదవికి జస్టిన్ లాంగర్ రాజీనామా చేయడంపై ఆ జట్టు టెస్టు సారథి ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ఈ విషయంపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వారికి సుదీర్ఘ లేఖ రాశాడు. జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది అభిప్రాయాల ప్రకారమే ఆస్ట్రేలియాకు కొత్త కోచ్ అవసరమని తెలిపాడు. కాగా, లాంగర్.. గత ఆదివారం తన పదవి నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించడంతో ఆ క్రికెట్ బోర్డు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే పలువురు మాజీ క్రికెటర్లు లాంగర్కు అనుకూలంగా, కమిన్స్కు వ్యతిరేకంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఆసీస్ సారథి వీటిపై స్పందించాడు.
‘చాలా మంది మాజీలు నాకు వ్యక్తిగతంగా, బహిరంగంగా పలు సూచనలు చేశారు. ఆటపై మీకున్న ప్రేమ, మీ సహచర ఆటగాడి కోసం మీరంతా ఆ పని చేశారు. అందుకు మీకు ధన్యవాదాలు. అయితే, మీ అందరికీ ఒక విషయం చెప్పదల్చుకున్నా. మీరంతా ఎప్పుడూ మీతోటి ఆటగాళ్లకు ఎలా అండగా ఉన్నారో.. నేనూ ఇప్పుడు నా జట్టు కోసం అలాగే ఉన్నా. లాంగర్ రాజీనామా చేసినప్పటి నుంచి తీవ్ర చర్చ జరుగుతోంది. అదే సమయంలో నేను కూడా ఎలాంటి బహిరంగ ప్రకటనా చేయలేదు. ఇప్పుడు మీ అందరికీ ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. తన కోచింగ్ వ్యవహారశైలి కాస్త కఠినంగా ఉంటుందని లాంగర్ చెప్పుకొన్నాడు. అందుకు అతడు ఆటగాళ్లకు, ఇతర సహాయ సిబ్బందికీ క్షమాపణలు చెప్పాడు. అయితే, అంత అవసరం లేదనిపించింది. ఎందుకంటే మేమెప్పుడూ దాన్ని కఠినమైన శిక్షణగా భావించలేదు. మాకు అది అసలు సమస్యే కాదు. అయితే, ఇప్పుడు మేమున్న అత్యుత్తమ దశలో కొత్త కోచ్ కావాలని అనుకుంటున్నాం. మా ఆటగాళ్లు కూడా ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బోర్డు కూడా అతడి రాజీనామాను అంగీకరించింది’ అని కమిన్స్ వివరించాడు.
కాగా, లాంగర్ 2018లో ఆ జట్టు కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఆ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత కోచ్గా నియమితుడయ్యాడు. ఈ క్రమంలోనే ఆసీస్ రెండు సార్లు భారత్ చేతిలో బోర్డర్-గావస్కర్ సిరీస్లు కోల్పోయింది. అయితే, ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలవడం, ఇంగ్లాండ్పై యాషెస్ సిరీస్ గెలవడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్