punjab : ఈసారైనా పంజాబ్ రాత మారేనా..?
గత సీజన్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో..
తొలి సీజన్ నుంచి పద్నాలుగో సీజన్ వరకూ కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్కు చేరింది. జట్టు నిండా కీలక ఆటగాళ్లు, టీమ్ ఇండియా దిగ్గజం అనిల్ కుంబ్లే కోచ్గా ఉన్నా కప్ను మాత్రం అందుకోలేకపోయింది. ఈ సారైనా పంజాబ్ కిరీటం దక్కించుకుంటుందో లేదో వేచి చూడాలి. మరో వారం రోజుల్లో కొత్త సీజన్ ప్రారంభం కాబోతోంది.. ఈ తరుణంలో ఓసారి పంజాబ్ టీమ్ కీలక ఆటగాళ్లు.. బలాబలాలు.. బలహీనతలు.. ఏంటో చూద్దాం..
గత సీజన్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో బ్యాటర్ కేఎల్ రాహుల్. వ్యక్తిగతంగా మంచి ఇన్నింగ్స్లను ఆడినా.. జట్టును ప్లేఆఫ్స్కు తీసుకెళ్లడంలో రాహుల్ విఫలమయ్యాడు. మెగా వేలానికి ముందే ఈసారి కేఎల్ రాహుల్ను పంజాబ్ వదిలేసుకుంది. మయాంక్తోపాటు అన్క్యాప్డ్ ఆటగాడు అర్ష్దీప్ సింగ్ను మాత్రమే రిటెయిన్ చేసుకుంది. మయాంక్ను సారథిగా నియమించింది. మెగా వేలంలో సీనియర్లతోపాటు యువ క్రికెటర్లను కొనుగోలు చేసుకుంది.
వీరి కోసం భారీ ధర..
పంజాబ్ వేలంలో అత్యధికంగా లియామ్ లివింగ్ స్టోన్ను రూ.11.50 కోట్లకు సొంతం చేసుకుంది. అలానే జానీ బెయిర్స్టో, శిఖర్ ధావన్, ఓడియన్ స్మిత్, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, సందీప్ శర్మ కోసం భారీ మొత్తం వెచ్చించింది. బ్యాటింగ్ పరంగా శిఖర్ ధావన్, బెయిర్ స్టో, మయాంక్ అగర్వాల్, లివింగ్ స్టోన్తో టాప్ ఆర్డర్ బలంగా ఉంది. ఇక మిడిలార్డర్లో భనుక రాజపక్స, ఓడియన్ స్మిత్, షారుఖ్ ఖాన్ ధాటిగా ఆడగలిగే సత్తా ఉన్న బ్యాటర్లు. పంజాబ్కు ఓపెనింగ్ సమస్య లేదు. మయాంక్తోపాటు శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు. బ్యాకప్ ఓపెనర్గా ఎలానూ జానీ బెయిర్స్టో ఉన్నాడు.
పేస్ బౌలింగ్ ఓకే.. కానీ స్పిన్ విభాగమే
పంజాబ్ జట్టులో టాప్ పేసర్ కగిసో రబాడ.. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ బౌలర్ పంజాబ్ బౌలింగ్ దళాన్ని నడిపించనున్నాడు. ఇప్పటికే అర్ష్దీప్ సింగ్ను రిటెయిన్ చేసుకున్న సంగతి తెలిసిందే. గత సీజన్ వరకు హైదరాబాద్కు కీలక బౌలర్ అయిన సందీప్ శర్మ, యువ క్రికెటర్ వైభవ్ అరోరాతోపాటు ఆల్రౌండర్ ఓడియన్ స్మిత్తో పేస్ బౌలింగ్ బాగానే ఉంది. అయితే స్పిన్నర్లలో రాహుల్ చాహర్ ఒక్కడే కాస్త చెప్పుకోదగ్గ బౌలర్. ఆల్రౌండర్ షారుఖ్ ఖాన్ కూడా స్పిన్ వేయగలిగినా అంతర్జాతీయ స్థాయి కాకపోవడం లోటనే చెప్పాలి. లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్కు కూడా దేశవాళీలో బౌలింగ్ చేసిన అనుభవం ఉంది. భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసుకున్న లివింగ్స్టోన్ లెగ్ స్పిన్ వేయగలడు.
పంజాబ్ జట్టు: మయాంక్ అగర్వాల్, భనుక రాజపక్స, శిఖర్ ధావన్, జితేశ్ శర్మ, జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రన్ సింగ్, అన్ష్ పటేల్, అథర్వ తైడే, బెన్నీ హోవెల్, హర్ప్రీత్ బ్రార్, లియామ్ లివింగ్స్టోన్, ఓడియన్ స్మిత్, ప్రేరక్ మన్కడ్, రాజ్ అగద్ బవా, రిషి ధావన్, షారుఖ్ ఖాన్, వృత్తిక్ ఛటర్జీ, అర్ష్దీప్ సింగ్, బాల్తేజ్ ధండా, ఇషాన్ పోరెల్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, సందీప్ శర్మ, వైభవ్ అరోరా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)