Tokyo Olympics: దేశానికి పతకం తెస్తానని ముందే చెప్పింది
ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్లో సెమీఫైనల్కు చేరుకొని పతకాన్ని ఖాయం చేసుకుంది బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్(23). ఆమె సెమీస్కు చేరుకోవడంతో అస్సాంలోని ఆమె కుటుంబసభ్యులపై అభినందనల వర్షం కురుస్తోంది....
డిస్పుర్: ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్లో సెమీఫైనల్కు చేరుకొని పతకాన్ని ఖాయం చేసుకుంది బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్(23). ఆమె సెమీస్కు చేరుకోవడంతో అస్సాంలోని ఆమె కుటుంబసభ్యులపై అభినందనల వర్షం కురుస్తోంది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ టర్కీకి చెందిన బుసేనాజ్ సుమెనెలితో లవ్లీనా బుధవారం సెమీస్లో పోరాడనుంది. ఈ నేపథ్యంలోనే లవ్లీనా తండ్రి స్పందించారు. ఆమె విజయం కోసం అస్సాం అంతా ప్రార్థిస్తోందని పేర్కొన్నారు.
దేశానికి ఒలింపిక్ పతకం తీసుకొస్తానని లవ్లీనాకు ఎంతో నమ్మకముండేదని.. ఆ విషయాన్ని నిజం చేసిందని బాక్సర్ తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. టోక్యోకు వెళ్లే ముందు కూడా ఆ విషయాన్ని తమతో పంచుకుందని.. పతకంతోనే తిరిగి ఇంటికి వస్తానని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. లవ్లీనా బంగారు పతకం సాధించాలని తమతోపాటే గ్రామంలోని అనేక మంది ప్రార్థిస్తున్నారని.. కొందరు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్లో లవ్లీనా బొర్గొహైన్ 69 కిలోల విభాగంలో అదరగొట్టింది. గత నెల 30న జరిగిన క్వార్టర్స్ పోరులో చైనీస్ తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ నీన్-చిన్పై 4-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్లో బెర్త్ ఖరారు చేసుకుంది. బుధవారం జరిగే సెమీస్లో గెలిస్తే ఫైనల్కు వెళ్తుంది. ఒకవేళ ఓడిపోయినా.. కనీసం కాంస్య పతకం దక్కుతుంది. లవ్లీనా కంటే ముందు విజేందర్సింగ్, మేరీకోమ్లు మాత్రమే బాక్సింగ్లో భారత్కు పతకాలు తెచ్చిపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.