Ganguly: నేనూ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించా.. ఆ కారణం నాకు తెలుసు : గంగూలీ
వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించడంపై విమర్శలు చెలరేగడంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.
ఇంటర్నెట్డెస్క్: వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించడంపై విమర్శలు చెలరేగడంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి స్పందించారు. ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ తెరవెనుక ఏమి జరిగిందో వెల్లడించారు. వన్డే ఫార్మాట్ నుంచి విరాట్ను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో వివరించారు. విరాట్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు.
‘‘నేను మీకో విషయం చెప్పాలనుకుంటున్నా. టీ20 ఫార్మాట్ నాయకత్వాన్ని వదిలేయవద్దని నేను వ్యక్తిగతంగా విరాట్ను అభ్యర్థించాను. కానీ.. ఆ బాధ్యతలను అతను భారంగా భావించాడు. అలా అనుకోవడం మంచిదే. అతడో అద్భుతమైన క్రికెటర్. ఆటతో మమేకమై ఉంటాడు. అతడు చాలా రోజుల పాటు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాక ఈ నిర్ణయానికి వచ్చాడు. నేను కూడా చాలా రోజులు కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించాను. అందుకే నాకు ఆ కారణం తెలుసు. వారు (సెలక్టర్లు) తెల్లబంతి ఫార్మాట్కు ఒకే కెప్టెన్ ఉండాలనుకున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ, ఒక్క విషయం చెప్పగలను. ఇదొక అద్భుతమైన జట్టు.. కొందరు ప్రతిభావంతులు కూడా ఉన్నారు. వారు ఏ లోటు రానీయరని ఆశిస్తున్నాను’’ అని గంగూలీ పేర్కొన్నారు.
కోహ్లీ టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలు వదులుకుంటున్నట్లు ప్రకటించిన సమయంలో మాట్లాడుతూ.. దాదాపు తొమ్మిదేళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడటం.. ఐదేళ్లకుపైగా నాయకత్వ బాధ్యతలతో ఒత్తిడి పెరిగిపోయిందని పేర్కొన్నాడు. తన కోసం కొంత సమయం వెచ్చించుకొని వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు నాయకత్వం వహించేందుకు పూర్తిగా సంసిద్ధమై వస్తానని వెల్లడించారు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.