Asian Games: 10వేల మంది ఉన్న స్టేడియంలో పోయిన ఫోన్.. కనిపెట్టారిలా..!
Asian Games 2022: ఆసియా గేమ్స్లో పాల్గొన్న ఓ క్రీడాకారిణి రద్దీగా ఉన్న స్టేడియంలో తన ఫోన్ పోగొట్టుకుంది. పైగా అది స్విచ్చాఫ్ చేసి ఉంది. దీంతో వాలంటీర్లు ఎంతో కష్టపడి ఆ ఫోన్ను కనిపెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: పోగొట్టుకున్న ఫోన్ దొరకడం అంటే చాలా కష్టమే..! అదీనూ స్విచ్చాఫ్ చేసిన ఫోన్ (Phone) రద్దీ ప్రదేశాల్లో పోతే.. ఇక దానిపై ఆశలు వదలుకోవాల్సిందే..! చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games 2022) ఓ క్రీడాకారిణికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 10వేల మంది ఉన్న స్టేడియంలో ఆమె తన మొబైల్ ఫోన్ పోగొట్టుకుంది. అయితే అదృష్టమేంటంటే.. ఆ ఫోన్ ఆమెకు దొరికింది. ఆసియా గేమ్స్ వాలంటీర్లు ఎంతో కష్టపడి 24 గంటల్లోనే ఆమె ఫోన్ను కనిపెట్టేశారు. (Player Lost phone in Asian Games)
హాంకాంగ్ (Hong kong)కు చెందిన 12 ఏళ్ల చెస్ క్రీడాకారిణి లియు తియాన్ యి.. హాంగ్జౌ (Hangzhou Asian Games)లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పాల్గొంది. సోమవారం ఉదయం టోర్నీలో పాల్గొనేందుకు స్టేడియంకు వచ్చిన లియు.. తన ఫోన్ను పోగొట్టుకుంది. పైగా అది స్విచ్చాఫ్ చేసి ఉంది. దీంతో ఈ విషయాన్ని నిర్వాహకులకు చెప్పింది. దీంతో టోర్నీలు పూర్తయిన తర్వాత వాలంటీర్లు ఫోన్ కోసం వెతికారు.
భారత్ జోరు.. ఈక్వస్ట్రియన్లో బంగారు పతకం
10వేల సీట్ల సామర్థ్యం, 5,23000 చదరపు మీటర్ల విస్తీర్ణం గల స్టేడియంలో అణువణువు గాలించారు. సీట్ల వద్ద ఏర్పాటు చేసిన వేలాది వ్యర్థాల బ్యాగుల్లో రాత్రంతా వెతికారు. చివరకు ఓ బ్యాగులో లియు ఫోన్ను గుర్తించి ఆమెకు అందజేశారు. ఈ విషయాన్ని ఆసియా గేమ్స్ తన అధికారిక ఖాతాలో వెల్లడించింది. అసాధ్యమనుకున్న ఈ పనిని తమ వాలంటీర్లు 24 గంటల్లోనే పూర్తి చేసి.. ఆ క్రీడాకారిణి ఫోన్ను కనిపెట్టారని వారిని ప్రశంసించింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
సెప్టెంబరు 23 నుంచి మొదలైన ఆసియా క్రీడలు.. అక్టోబరు 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 45 దేశాల నుంచి దాదాపు 12వేల మందికి పైగా అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ మెగా టోర్నీలో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిశ్ నెహ్రాను (Ashish Nehra) టీమ్ఇండియా కోచింగ్ పదవి వరించినా.. వద్దని చెప్పడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశాయి. -
Cricket News: ఇప్పుడెందుకు ఈ టీ20 సిరీస్..? పందెం కోల్పోయానంటున్న కెవిన్.. టీమ్ఇండియాతోనూ బజ్బాల్!
-
Rahul Dravid: ‘టీ20 ప్రపంచకప్ ఉన్న ఈ తరుణంలో’.. కోచ్గా ద్రవిడ్ కొనసాగింపుపై గంభీర్ స్పందన
Rahul Dravid: టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా ఇతర కోచింగ్ బృంద కాంట్రాక్ట్ను బీసీసీఐ పొడిగించింది. దీనిపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తాజాగా స్పందించారు. -
Rahul Dravid: ఇన్నింగ్స్ ఇంకా ఉంది
సందిగ్ధత తొలగింది. ఊహాగానాలకు తెరపడింది. టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నాడు. అతడి కాంట్రాక్ట్ను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏలోనే ఉంటాడు. -
Dravid: మెప్పించాడు ఇలా...
జూనియర్ కోచ్గా, ఎన్సీఏ అధిపతిగా తనదైన ముద్ర వేసినా, మంచి పేరు తెచ్చుకున్నా ద్రవిడ్ ఏనాడు టీమ్ఇండియా కోచ్ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినా ఎందుకో అతడు విముఖత వ్యక్తం చేశాడు. కానీ ద్రవిడ్ ఒకప్పటి సహచరుడైన గంగూలీ (అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు).. రవిశాస్త్రి అనంతరం కోచ్గా ఉండేలా ద్రవిడ్ను ఒప్పించగలిగాడు. -
Rohit Sharma: మరి రోహిత్?
దక్షిణాఫ్రికా పర్యటన కోసం సెలక్షన్ కమిటీ గురువారం భారత జట్లను ప్రకటించనుంది. టీ20ల్లో తిరిగి భారత్కు నాయకత్వం వహించాలని రోహిత్ శర్మను బీసీసీఐ పెద్దలు ఒప్పించడానికి ప్రయత్నించే అవకాశముంది. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓడినప్పటి నుంచి రోహిత్ పొట్టి క్రికెట్కు దూరంగా ఉన్నాడు. -
IND vs AUS: ఇలాంటి పరిస్థితుల్లో ఎంతైనా ఛేదించొచ్చు
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత పేసర్ల వైఫల్యానికి విపరీతమైన మంచు కారణమని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్కు 14 పరుగుల లక్ష్య ఛేదన కూడా సాధ్యమేనని తెలిపాడు. 222 స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్.. చివరి 5 ఓవర్లలో 80 పరుగులు సమర్పించుకుంది. -
ఆ అనుభవం ఉపయోగపడుతుంది
గొప్ప సారథుల ఆధ్వర్యంలో ఆడిన అనుభవం తనకెంతో ఉపయోగపడుతుందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్శర్మ సారథ్యంలో ఆడిన గిల్.. ఐపీఎల్లో తొలిసారిగా నాయకత్వం వహించనున్నాడు. -
వచ్చే ఏడాది శ్రీలంకకు టీమ్ఇండియా
సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ)కు శుభవార్త. వచ్చే ఏడాది జులై- ఆగస్టులో శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడేసి వన్డేలు.. టీ20ల్లో భారత్, శ్రీలంక తలపడతాయని 2024 వార్షిక క్యాలెండర్లో ఎస్ఎల్సీ పేర్కొంది. వచ్చే ఏడాది శ్రీలంక 52 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. -
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
ముంబయి ఇండియన్స్ (MI) జట్టులో ఏం జరుగుతుందనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. బుమ్రా పెట్టిన పోస్టుపై జట్టునే ఒక కుటుంబంగా భావించే మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తుందో అందరిలోనూ మెదిలే ప్రశ్న. -
విలియమ్సన్ సెంచరీ
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. ఆతిథ్య బంగ్లాదేశ్ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన కివీస్కు.. బ్యాటుతో ఇబ్బందులు తప్పలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/89) సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 8 వికెట్లకు 266 పరుగులు సాధించింది.


తాజా వార్తలు (Latest News)
-
Ranbir Kapoor: ఒకప్పుడు ఫ్లోర్ తుడిచి.. ఇప్పుడు స్టార్గా నిలిచి.. రణ్బీర్ ప్రయాణమిదీ
-
Narayana Murthy: ఆ రంగంలో మూడు షిఫ్టులు ఉండాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
-
Kiraak RP: సైలెంట్గా.. కిరాక్ ఆర్పీ వివాహం
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..