Modi: సింధు.. ఛాంపియన్లకే ఛాంపియన్
కామన్వెల్త్ క్రీడల్లో తెలుగు తేజం పీవీసింధు భారత్కు స్వర్ణం సంపాదించిపెట్టారు.
దిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో తెలుగు తేజం పీవీసింధు భారత్కు స్వర్ణం సంపాదించిపెట్టారు. కెనడా క్రీడాకారిణి మిచెలీ లీపై వరుస గేమ్స్లో ఆధిపత్యం చెలాయించి సింధు ఈ పతకాన్ని దక్కించుకుంది. దీంతో ఈ బ్యాడ్మింటన్ స్టార్పై ప్రశంసల వర్షం కురిసింది.
* పీవీ సింధు.. ఛాంపియన్లకే ఛాంపియన్. అత్యున్నత ప్రతిభ ఏంటో ఆమె ప్రతిసారి చూపిస్తున్నారు. ఆమె నిబద్ధత విస్మయానికి గురిచేస్తోంది. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన ఆమెకు అభినందనలు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను... ప్రధాని మోదీ
* భారత షట్లర్ పీవీ సింధు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి.. ఈ దేశానికి గర్వపడేలా చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం గెలిచిన మీకు అభినందనలు... కేంద్ర హోం మంత్రి అమిత్ షా
* పీవీ సింధు.. మీరు ఈ దేశ ప్రజలను ఆశ్చర్యపర్చడంలో ఎప్పటికీ విఫలం కారు. మీరు నారీ శక్తికి ప్రతిరూపం.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా