Rishabh Pant: రిషభ్ పంత్ ప్రమాద ఘటన.. స్పందించిన మోదీ
క్రికెటర్ రిషభ్ పంత్ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ట్విటర్ వేదికగా స్పందించిన ప్రధాని.. పంత్ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు.
మాజీ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar), క్రికెటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), హార్దిక్ పాండ్యా (Hardik Pandya), శిఖర్ ధావన్ సహా పలువురు ఆటగాళ్లు కూడా సోషల్మీడియా వేదికగా స్పందిస్తూ పంత్ (Pant)కు ధైర్యం చెప్పారు. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రోడ్డు ప్రమాదం.. క్రికెటర్ రిషభ్ పంత్కు తీవ్ర గాయాలు
శుక్రవారం ఉదయం దిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా పంత్ కారు డివైడర్ను ఢీకొట్టిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే అతడిని దేహ్రాదూన్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పంత్ తల, మోకాలికి గాయమైంది. వీపు భాగం కాలిపోయింది. అయితే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడానే ఉన్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రమాద సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడని.. దీంతో వాహనంలో మంటలు చెలరేగినట్లు డీజీపీ వెల్లడించారు. దీంతో రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, వసీం అక్రమ్, రవీంద్ర జడేజా, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, మునాఫ్ పటేల్, మహమ్మద్ అజారుద్దీన్ తదితరులు ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.