భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
కీలక ఆటగాళ్లు దూరమైనా టీమిండియా చేతిలో పరాజయాన్ని చవిచూడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ తెలిపాడు. స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్తో పటిష్ఠంగా ఉన్న తమ...
ఇంటర్నెట్డెస్క్: కీలక ఆటగాళ్లు దూరమైనా టీమిండియా చేతిలో పరాజయాన్ని చవిచూడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ తెలిపాడు. స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్తో పటిష్ఠంగా ఉన్న తమ జట్టు స్వదేశంలో ఓటమిపాలవ్వడం ఎంతో కష్టంగా ఉందని అన్నాడు. గొప్ప పోరాట పటిమ చూపిన భారత ఆటగాళ్లు విజయానికి అర్హులని పేర్కొన్నాడు. గాయాలతో ప్రధాన ఆటగాళ్లు జట్టుకు దూరమైనా యువ భారత్ ఆస్ట్రేలియాను మట్టికరింపిచి బోర్డర్-గావస్కర్ ట్రోఫీని 2-1తో సాధించిన విషయం తెలిసిందే.
‘‘ఈ సిరీస్ను ఆస్ట్రేలియా గెలవకపోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓటమిపై ఎన్నో కారణాలు ఉన్నాయి. గత అయిదు వారాల్లో టీమిండియా పరిస్థితి చూస్తే.. కెప్టెన్ కోహ్లీ లేడు, గాయాలతో ఆటగాళ్లు దూరమయ్యారు. సిరీస్ను దాదాపు 20 మంది ఆటగాళ్లతో ఆడారు. మరోవైపు ఆస్ట్రేలియా ఎంతో పటిష్ఠంగా ఉంది. అయినా మేం ఓటమి పాలవ్వడం ఎంతో కష్టంగా ఉంది. ప్రతి టెస్టులో కీలకమైన సమయాల్లో టీమిండియానే పైచేయి సాధించింది. కానీ ఆస్ట్రేలియా సాధించలేకపోయింది. రెండు జట్ల మధ్య ఉన్న తేడా ఇదే. భారత్ గొప్పగా ఆడింది. విజయానికి వారే అర్హులు’’ అని పాంటింగ్ అన్నాడు.
జడేజా స్థానాన్ని భర్తీ చేసిన సుందర్ను పాంటింగ్ ప్రత్యేకంగా కొనియాడాడు. ‘‘వాషింగ్టన్ సుందర్ 50 టెస్టులు ఆడిన అనుభవజ్ఞుడిగా ఆడాడు. జట్టులో స్థానం కోసం ఆడినట్లుగా అనిపించలేదు. మరోవైపు తన కెరీర్లో రెండో టెస్టు ఆడుతున్న శార్దూల్ ఠాకూర్ ఏడు వికెట్లు తీసి 60కు పైగా పరుగులు సాధించాడు. ఐపీఎల్ అనుభవం ఉన్న నాకు భారత్ సామర్థ్యం ఏంటో తెలుసు. ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. కానీ ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్ గెలవడం భిన్నమైనది’’ అని తెలిపాడు.
‘‘గత పర్యటనలో భారత్ విజయం సాధించినప్పుడు వార్నర్, స్మిత్ జట్టులో లేరు కాబట్టి ఓటమిపాలయ్యామనే అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు ఆసీస్ పూర్తి సామర్థ్యంతో ఉంది. భారత్ జట్టులో ప్రధాన ఆటగాళ్లు లేరు. నెట్ బౌలర్లతో మ్యాచ్ ఆడింది. విజయం సాధించింది కూడా. అదే ఆస్ట్రేలియాకు తీవ్ర బాధని కలిగిస్తోంది. ‘ఏ’ జట్టుతో బరిలోకి దిగి రెండు టెస్టులను భారత్ గెలిచింది. అది కూడా గబ్బాలో విజయం సాధించడం నమ్మలేకపోతున్నా’’ అని పాంటింగ్ పేర్కొన్నాడు.
తొలి టెస్టులో కోహ్లీసేన ఓటమిపాలైన తర్వాత పాంటింగ్ టీమిండియాను తక్కువగా అంచనా వేస్తూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భారత్ తిరిగి పుంజుకోవడం అసాధ్యమని, సిరీస్ 4-0తో ఆసీస్దే అని పేర్కొన్నాడు. అంతేగాక గబ్బా టెస్టు జరుగుతున్న సమయంలో తమ జట్టు డ్రా చేసిన ఓటమితోనే సమానమని, తప్పక గెలవాలని అన్నాడు. కానీ కంగారూల కంచుకోట అయిన గబ్బాలో భారత్ విజయకేతనం ఎగురవేసి ఆసీస్కు గర్వభంగం కలిగించింది.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)