IND vs AUS: అహ్మదాబాద్ టెస్టులో వారిద్దరినీ ఆడించాలి: రికీ పాంటింగ్
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు దూసుకెళ్లేందుకు భారత్కు (Team India) కీలకమైన మ్యాచ్ ఇది. అయితే, తుది జట్టుపై టీమ్ఇండియా తర్జనభర్జనలు పడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భారత్ - ఆస్ట్రేలియా(IND vs AUS) జట్ల మధ్య మార్చి 9 నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు దూసుకెళ్లాలంటే టీమ్ఇండియా (Team India)కు ఇది చాలా కీలకం. అయితే, జట్టు కూర్పుపై మాత్రం భారత మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. తొలి రెండుటెస్టుల్లో విఫలమైన కేఎల్ రాహుల్ను తప్పించి యువ బ్యాటర్ శుభ్మన్ గిల్కు అవకాశం కల్పించింది. కానీ, మూడో టెస్టులో గిల్ నిరాశపరిచాడు. ఈ క్రమంలో కీలకమైన నాలుగో మ్యాచ్కు వీరిద్దరిలో ఎవరిని తీసుకోవాలి...? లేకపోతే మిడిల్లో దూకుడుగా ఆడే బ్యాటర్ లేకపోవడం వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి సూర్యకుమార్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా..? అనేది తెలియాలంటే వేచి చూడాలి. అయితే, నాలుగో టెస్టు మ్యాచ్కు తుది జట్టులో వీరిద్దరినీ తీసుకోవాలని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చెప్పాడు.
‘‘మూడో టెస్టులో కేఎల్ రాహుల్ స్థానంలో శుభ్మన్ గిల్ వచ్చాడు. కానీ, గిల్ ఆకట్టుకోలేకపోయాడు. అయితే, నాలుగో టెస్టులో ఇద్దరినీ ఆడించేందుకు అవకాశం ఉంది. శుభ్మన్ గిల్ను ఓపెనింగ్కు పంపి.. కేఎల్ను మిడిలార్డర్లో ఆడించొచ్చు. ఇంతకుముందు కూడా రాహుల్ ఇదే స్థానంలో టెస్టు క్రికెట్ ఆడాడు. WTC Final జరిగే యూకేలోని పిచ్ పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. బంతి ఎక్కువగా స్వింగ్ అవుతూనే ఉంటుంది. భారత్, ఆసీస్ జట్లు అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతాయని అనుకుంటున్నా. ఇది కేవలం టెస్టు మ్యాచ్ మాత్రమే కాదు.. ఇరు జట్లకూ చాలా కీలకం’’అని పాంటింగ్ తెలిపాడు. వరుసగా రెండు టెస్టుల్లో గెలిచి ఊపుమీదున్న భారత్కు మూడో మ్యాచ్లో షాక్ తగిలింది. అనూహ్యంగా ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు