Dilip Vengsarkar : ఆ ఇద్దరిలో ఒకరికి కెప్టెన్సీ అప్పగిస్తే బాగుంటుంది: దిలీప్ వెంగ్సర్కార్
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ ముగింపు పలికినప్పటి నుంచి.. తర్వాతి కెప్టెన్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు కోహ్లీ వారసుడు ఎవరనే...
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ ముగింపు పలికినప్పటి నుంచి.. తర్వాతి కెప్టెన్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు కోహ్లీ వారసుడు ఎవరనే దానిపై కొన్ని పేర్లను సూచించారు. తాజాగా, సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ దిలీప్ వెంగ్ సర్కార్.. టీమ్ఇండియా కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్లలో ఒకరికి బాధ్యతలు అప్పగించాలని సూచించాడు.
‘ఓపెనర్ రోహిత్ శర్మ, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్లలో ఒకరికి ఏడాది కాలం పాటు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి. ఇదే సమయంలో భారత జట్టుకు భవిష్యత్ కెప్టెన్ను కూడా సిద్ధం చేసుకోవాలి. నేను సెలెక్షన్ కమిటీ ఛైర్మన్గా ఉన్న సమయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలకడంతో.. తర్వాతి కెప్టెన్ ఎవరనే విషయంలో సందిగ్ధం నెలకొంది. అప్పటికే వన్డే జట్టుకు కెప్టెన్గా కొనసాగుతున్న ధోనికే టెస్టు పగ్గాలు కూడా అప్పగించాలని కొందరు సూచించారు. అయితే, మేం బాగా ఆలోచించి అనుభవమున్న అనిల్ కుంబ్లేను ఆస్ట్రేలియా పర్యటనకు కెప్టెన్గా ఎంపిక చేశాం. అతడు అద్భుతంగా రాణించాడు. అదే సమయంలో ధోనిని భవిష్యత్ టెస్టు కెప్టెన్గా తీర్చిదిద్దాం’ అని దిలీప్ వెంగ్ సర్కార్ పేర్కొన్నాడు.
కెప్టెన్సీ ఒత్తిడి కారణంగానే విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో విఫలమవుతున్నాడనే వ్యాఖ్యలను దిలీప్ కొట్టిపారేశాడు. ‘కెప్టెన్సీ ఒత్తిడి కారణంగానే కోహ్లీ విఫలమవుతున్నాడనే వాదనతో నేను ఏకీభవించను. గత ఐదేళ్లుగా ఇటు కెప్టెన్గా, అటు బ్యాటర్గా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. భారతీయులు ఎప్పుడూ రికార్డుల ఆధారంగానే ఆటగాడిని అంచనా వేస్తుంటారు. అలాంటి రికార్డులను నేను పట్టించుకోను. గత రెండేళ్లుగా అతడు సెంచరీ నమోదు చేయలేదనేది వాస్తవమే. కానీ, జట్టుకు అవసరమైనప్పుడు మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇటీవల కేప్టౌన్లో జరిగిన టెస్టులో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా.. కోహ్లీ నిలకడగా ఆడాడు. 160 బంతులను ఎదుర్కొని 79 పరుగులు చేశాడు. అతడు చాలా నిబద్ధతతో ఆడుతున్నాడు’ అని వెంగ్ సర్కార్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్