COVID-19: కోలుకున్న ప్రసిద్ధ్ కృష్ణ, అమిత్‌ మిశ్రా

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ, టీమ్‌ ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌, దిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌  అమిత్ మిశ్రా కొవిడ్-19 నుంచి కోలుకున్నారు.

Published : 19 May 2021 22:33 IST

(photo: Prasidh Krishna Twitter)

ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ, టీమ్‌ ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌, దిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌  అమిత్ మిశ్రా కొవిడ్-19 నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న విషయాన్ని మిశ్రా స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు.‘మన కరోనా ఫ్రంట్ లైన్‌ వర్కర్స్‌ నిజమైన హీరోలు. నేను కరోనా నుంచి కోలుకున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు, మీ కుటుంబసభ్యులు చేస్తున్న త్యాగాలకు మీకెంతో రుణపడి ఉన్నాం’ మిశ్రా ట్వీట్‌ చేశాడు.

ప్రసిద్ధ్‌ కృష్ణ కొవిడ్ నుంచి కోలుకున్నట్లు ఓ బీసీసీఐ అధికారి ద్వారా తెలిసింది. సౌథాంప్టన్‌ వేదికగా వచ్చే నెల 18-22 మధ్య న్యూజిలాండ్, భారత్ మధ్య జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్ ఫైనల్‌,  ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టులకు ప్రసిద్ధ్‌ కృష్ణ స్టాండ్ బై బౌలర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. కాగా, మిశ్రా మే 4న కరోనా బారినపడగా, ప్రసిద్ధ్‌కు మే 8న పాజిటివ్‌గా తేలింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని