Prasidh Krishna: ఆరోన్ ఫించ్, ప్రసిద్ధ్ కృష్ణల మధ్య మాటల యుద్ధం.. నెటిజన్ల ఆగ్రహం
కోల్కతా ఓపెనర్ ఆరోన్ ఫించ్తో మాటలతూటాలు పేల్చిన నేపథ్యంలో రాజస్థాన్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని అంటున్నారు...
(Photos: Aaron Finch and Prasidh Krishna Instagram)
ఇంటర్నెట్డెస్క్: కోల్కతా ఓపెనర్ ఆరోన్ ఫించ్తో మాటల యుద్ధానికి దిగిన రాజస్థాన్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని అంటున్నారు. గతరాత్రి రాజస్థాన్ నిర్దేశించిన 218 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్కతా 210 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఓపెనర్ సునీల్ నరైన్ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటైనా.. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ (58), వన్డౌన్ బ్యాట్స్మన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (85) ధాటిగా ఆడారు. రెండో వికెట్కు వీరిద్దరూ 9 ఓవర్లకే 107 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ప్రసిద్ధ్ వేసిన ఆ ఓవర్ చివరి బంతికి ఫించ్ ఔటయ్యాడు.
ఆ సమయంలో కోల్కతా ఓపెనర్ పెవిలియన్కు వెళ్తుండగా ప్రసిద్ధ్ను చూస్తూ ఏవో మాటలు అన్నాడు. దీంతో వెంటనే స్పందించిన రాజస్థాన్ పేసర్ కూడా దీటుగా స్పందిస్తూ కోపంగా ఏవో మాటలు అన్నాడు. అయితే, వారు ఏమనుకున్నారో బయటకు తెలియరాలేదు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే.. నెటిజన్లు మాత్రం ప్రసిద్ధ్పై మండిపడుతున్నారు. అతడి బౌలింగ్పైనా విమర్శిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో ఫించ్, శ్రేయస్ ఔటయ్యాక కోల్కతా బ్యాట్స్మెన్ పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో చివరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 11 పరుగులు అవసరమవ్వగా 3 పరుగులే చేసి ఆఖరి రెండు వికెట్లు కోల్పోయారు. అలా రాజస్థాన్ 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!