Prithvi Shaw: సెల్ఫీలు నిరాకరించినందుకు పృథ్వీ షాపై దాడి.. 8 మందిపై కేసు నమోదు
జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తూ ఉన్న టీమ్ఇండియా (Team India) యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అయితే ఇందులో ఎలాంటి గాయాలు కాలేదు కానీ, అతడి స్నేహితుడి కారు మాత్రం ధ్వంసమైంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా (Team India) యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) దాడికి గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడితో కలిసి బుధవారం (ఫిబ్రవరి 15న) ఓ హోటల్కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముంబయిలోని ఓషివారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత సెల్ఫీలను తిరస్కరించినందుకు దాడి చేసినట్లు (Attack On Prithvi Shaw) భావించినప్పటికీ.. డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పృథ్వీ షా స్నేహితుడు ఆశిశ్ సురేంద్ర పేర్కొన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సురేంద్రతో కలిసి పృథ్వీ షా శాంతాక్రూజ్లోని ఓ ఫైవ్స్టార్ హోటల్కు వెళ్లాడు. నిందితులు సెల్ఫీ కోసం పృథ్వీ షా వద్దకు వచ్చారు. అయితే ఇద్దరితో మాత్రమే సెల్ఫీ దిగేందుకు షా ఆసక్తి చూపగా.. గ్రూప్లోని మిగతావారు కూడా వచ్చి సెల్ఫీ ఇవ్వాలన్నారు. తాను స్నేహితులతో కలిసి భోజనానికి వచ్చానని, ఇప్పుడు అందరితో సెల్ఫీ ఇవ్వడం కుదరదని పృథ్వీ షా వారికి సమాధానం ఇచ్చాడు. అప్పటికీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో షా స్నేహితుడు వెంటనే హోటల్ మేనేజర్ను పిలిచి ఫిర్యాదు చేశారు. హోటల్ నుంచి వెళ్లిపోవాలని నిందితులను మేనేజర్ అడగడంతో అదంతా మనసులో పెట్టుకొని.. హోటల్ నుంచి బయటకు వచ్చిన పృథ్వీ షా, అతడి స్నేహితుడి కారుపై బేస్బాల్ బ్యాట్లతో దాడికి పాల్పడ్డారు. బీఎండబ్ల్యూ కారు వెనుక, ముందర భాగంలోని కిటికీలు ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు.
సంఘటన సమయంలో కారులోనే పృథ్వీ షా ఉన్నాడని.. అయితే దీనిని వివాదం చేయకూడదనే ఉద్దేశంతో అతడిని వేరే కారులో సురక్షితంగా ఇంటికి పంపించినట్లు సురేంద్ర తెలిపారు. అయితే ఓ మహిళ తన కారును వెంబడించి మరీ జోగేశ్వరి లోటస్ పెట్రోల్ పంప్ దగ్గర ఆపేసిందని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిందని, లేకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని వెల్లడించారు. ఫిర్యాదు అందుకొన్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పృథ్వీ షాను సెల్ఫీలను అడిగిన వివరాలను హోటల్ సిబ్బంది నుంచి రాబట్టిన పోలీసులు నిందితులిల్లో ఇద్దరిని గుర్తించారు. సనా అలియాస్ సప్నా గిల్, శోభిత్ ఠాకూర్ను అదుపులోకి తీసుకొన్నారు. ఎనిమిది మందిపై ఐపీసీ సెక్షన్స్ 143, 148, 149, 384, 437, 504, 506 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.