పృథ్వీషా కొడితే.. రికార్డు బద్దలే!
టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్, ముంబయి సారథి పృథ్వీషా దేశవాళి క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. విజయ్ హజారె ట్రోఫీలో ఒకే సీజన్లో 800కు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్గా నిలిచాడు...
విజయ్ హజారె ట్రోఫీలో అరుదైన ఘనత..
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా యువ బ్యాట్స్మన్, ముంబయి సారథి పృథ్వీషా దేశవాళి క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. విజయ్ హజారె ట్రోఫీలో ఒకే సీజన్లో 800కు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్గా నిలిచాడు. ఆదివారం ఉత్తర్ ప్రదేశ్తో జరిగిన ఫైనల్లో 313 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పృథ్వీ(73; 39 బంతుల్లో 10x4, 4x6) ధాటిగా ఆడుతూ ఔటయ్యాడు. ఈ క్రమంలోనే అతడు ఒకే సీజన్లో 827 పరుగుల అత్యధిక స్కోర్ సాధించాడు.
2018లో కర్ణాటక తరఫున మయాంక్ అగర్వాల్ సాధించిన 723 పరుగులే ఇదివరకు ఈ ట్రోఫీలో అత్యధిక స్కోర్గా నమోదైంది. ఈ సీజన్లో దాన్ని ఇద్దరు ఆటగాళ్లు అధిగమించి కొత్త రికార్డులు సృష్టించారు. వారే ముంబయి కెప్టెన్ పృథ్వీ(825), కర్ణాటక బ్యాట్స్మన్ దేవ్దత్ పడిక్కల్(725). కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు తర్వాత టీమ్ఇండియా.. పృథ్వీని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. దాంతో అతడు స్వదేశానికి తిరిగొచ్చాక తన వైఫల్యాలపై దృష్టి సారించాడు. ఈ నేపథ్యంలోనే విజయ్ హజారె ట్రోఫీలో పట్టుదలగా బ్యాటింగ్ చేసి మూడు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ బాదాడు.
మరోవైపు ఇప్పుడు అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తర్ప్రదేశ్ 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 312 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు మాధవ్ కౌషిక్(158*; 156 బంతుల్లో 15x4, 4x6), సామ్రాట్ సింగ్(55; 73 బంతుల్లో 4x4, 3x6) ధాటిగా ఆడగా, తర్వాత ప్రియమ్గార్గ్(21), అక్ష్దీప్నాథ్(55) తమ వంతు పరుగులు చేశారు. దాంతో ముంబయి ముందు 313 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఈ క్రమంలోనే పృథ్వీ మరోసారి ధాటిగా ఆడి ముంబయికి శుభారంభం చేశాడు. ఆపై ఆదిత్య తారె(118; 107 బంతుల్లో 18x4), శివమ్దూబె(42; 28 బంతుల్లో 6x4, 1x6) చెలరేగి 41.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..