IPL 2022: అలా చేస్తే మీ కర్మ .. పృథ్వీ షా ఘాటు వ్యాఖ్యలు
తన గురించి తెలియనప్పుడు ఒక అంచనాకు రావద్దని దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా అంటున్నాడు. ఇటీవల ఐపీఎల్-15వ సీజన్ కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన...
ఇంటర్నెట్డెస్క్: తన గురించి తెలియనప్పుడు ఒక అంచనాకు రావద్దని దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా అంటున్నాడు. ఇటీవల ఐపీఎల్-15వ సీజన్ కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన యోయో పరీక్షలో అతడు విఫలమైన సంగతి తెలిసిందే. ఆ ఫిట్నెస్ పరీక్షలో ఆటగాళ్లు అర్హత సాధించాలంటే కనీసం 16.5 పాయింట్లు సాధించాలి. అయితే, పృథ్వీ 15 పాయింట్లే సాధించాడు. దీంతో అతడు ఐపీఎల్లో ఆడలేడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇన్స్టాగ్రామ్లో స్పందించిన పృథ్వీ తన స్టోరీస్లో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. అవి నెటిజన్ల కంట పడటంతో ఆ పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది.
‘నా పరిస్థితులేంటో తెలియనప్పుడు దయచేసి నా గురించి ఒక అంచనాకు రాకండి. నన్ను నిందించకండి. అలా చేస్తే మీ కర్మ మీరే బాధ్యులు అవుతారు’ అని పృథ్వీ పేర్కొన్నాడు. ఇక ఈ విషయంపై స్పందించిన దిల్లీ యాజమాన్యంలోని ఓ అధికారి.. యోయో పరీక్షతో ఐపీఎల్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది కేవలం ఆటగాళ్ల ఫిట్నెస్ అప్డేట్ తెలియజేస్తుందని, పృథ్వీని దిల్లీ తరఫున ఆడనివ్వకుండా చేయదని చెప్పారు. అతడు వరుసగా మూడు రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడేసరికి ఫిట్నెస్లో మార్పులు చోటు చేసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇక దిల్లీ యాజమాన్యం గతేడాది రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాలో రిషభ్ పంత్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్జ్తో సహా పృథ్వీని కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఈసారి ఐపీఎల్ ఆడతాడో లేదో అధికారికంగా తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!