Prithvi Shaw: నెల రోజుల వ్యవధి.. చాలా కష్టపడ్డా.. ఫలితం సాధించా: పృథ్వీ షా
దిల్లీ చేతిలో ఓటమితో పంజాబ్ కింగ్స్ (PBKS vs DC) ప్లేఆఫ్స్ అవకాశాలకు గండి పడింది. ఇక తన చివరి మ్యాచ్లోనూ (రాజస్థాన్తో) గెలిచినా ప్రయోజనం శూన్యం. దాదాపు ఇంటిముఖం పట్టినట్లే.
ఇంటర్నెట్ డెస్క్: దిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాటర్ పృథ్వీ షా (54: 38 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్) ఈ సీజన్లో తొలిసారి అర్ధశతకంతో రాణించాడు. దీంతో పంజాబ్ కింగ్స్పై దిల్లీ 213/2 స్కోరు చేసింది. దాదాపు నెల రోజుల తర్వాత దిల్లీ తరఫున పృథ్వీ బరిలోకి దిగాడు. ఆరంభంలో వరుసగా ఆడిన మ్యాచుల్లో విఫలమై విమర్శలపాలయ్యాడు. ఈ మ్యాచ్కు ముందు చివరిసారిగా ఏప్రిల్ 20న కోల్కతాతో ఆడాడు. ఆ తర్వాత ఇప్పుడే తుది జట్టులోకి వచ్చాడు. ఈ క్రమంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హాఫ్ సెంచరీ బాదాడు. మరోవైపు పంజాబ్ చివరి వరకు పోరాడినా 198/8కే పరిమితమై ఓటమిపాలైంది. ఈ క్రమంలో తన ప్రదర్శనపై పృథ్వీ షా సంతోషం వ్యక్తం చేశాడు. మరో బ్యాటర్ రోసోవ్ (82*: 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వచ్చింది.
‘‘చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడటం ఆనందంగా ఉంది. ఇలా ఆడాలంటే కొన్నిసార్లు తీవ్రంగా శ్రమించాలి. ఈ మ్యాచ్ కోసం చాలా కష్టపడ్డా. పిచ్ బాగుంది. ఆరంభంలో కాస్త పేస్కు అనుకూలంగా అనిపించినా.. బ్యాటింగ్కు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. తేమ ప్రభావం మ్యాచ్ ప్రారంభం నుంచే ఉంది. ఫీల్డర్ల మధ్య ఖాళీలను గుర్తించి ఆడగలితే సులువుగానే పరుగులు రాబట్టవచ్చు’’ అని షా తెలిపాడు.
ఫీల్డింగ్ బాగోలేదు: డేవిడ్ వార్నర్
‘‘విజయం సాధించడం ఆనందంగా ఉన్నప్పటికీ.. మా ఫీల్డింగ్ సరిగా లేదనిపించింది. క్యాచ్లను చేజార్చాం. పృథ్వీ షా ఇంపాక్ట్ చూపాడు. రిలీ రోసోవ్ అద్భుతంగా ఆడాడు. మా సొంత మైదానాల్లో నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది. చివరి మ్యాచ్ చెన్నైతో దిల్లీ వేదికగానే ఆడతాం’’ అని వార్నర్ చెప్పాడు.
నిరుత్సాహపరిచింది: ధావన్
‘‘కీలక సమయంలో ఓటమిని చవిచూడటం నిరుత్సాహానికి గురి చేసింది. తొలుత బౌలింగ్లో కాస్త వెనుకబడ్డాం. కొన్ని వికెట్లను తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి తేవాల్సింది. కానీ, అలా జరగలేదు. చివరి ఓవర్ను స్పిన్నర్తో వేయించడం కూడా మిస్ఫైర్ అయింది. ఆ ఓవర్లో ఏకంగా 23 పరుగులు వచ్చాయి. ఓ రెండు ఓవర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించడంతో దిల్లీ పెద్ద స్కోరు చేసేసింది. ఇక లక్ష్య ఛేదన సమయంలో తొలి ఓవర్లోని ఆరు బంతులను వృథా చేసేశాం. నేను కూడా ఎదుర్కొన్న మొదటి బంతికే పెవిలియన్కు చేరా. అయితే, మా బ్యాటర్ లియాన్ లివింగ్స్టోన్ పోరాటం అద్భుతం. చివర్లో నోబాల్ పడినప్పుడు కాస్త ఆశలు చిగురించాయి. దురదృష్టవశాత్తూ విజయం సాధించలేకపోయాం’’ అని పంజాబ్ కెప్టెన్ ధావన్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్