Pro Kabaddi:గుజరాత్‌ గురి కుదిరింది.. దిల్లీ అదుర్స్‌.. పట్నా మెరుపులు

క‌రోనా వ్యాప్తి తగ్గుముఖం ప‌ట్టాక ప్రారంభ‌మైన‌ ప్రో క‌బ‌డ్డీ లీగ్ సీజ‌న్ 8 రెండో రోజు పోటీలు ముగిశాయి.  బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్‌లో గుజరాత్  జెయింట్స్‌ బోణీ కొట్టింది.  జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌పై 34-27

Published : 23 Dec 2021 23:04 IST

బెంగళూరు: క‌రోనా వ్యాప్తి తగ్గుముఖం ప‌ట్టాక ప్రారంభ‌మైన‌ ప్రో క‌బ‌డ్డీ లీగ్ సీజ‌న్ 8 రెండో రోజు పోటీలు ముగిశాయి.  బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్‌లో గుజరాత్  జెయింట్స్‌ బోణీ కొట్టింది.  జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌పై 34-27 తేడాతో గుజరాత్‌ విజయం సాధించింది. గుజరాత్  జెయింట్స్‌లో గిరీశ్‌ ఇమాక్‌ (7), రాకేశ్‌ నర్వాల్ (7), రాకేశ్‌ సుంగ్రోయా (6), పర్వాశ్‌ భాన్స్‌వాల్ (4),ప్రదీప్‌ కుమార్‌ (2), రవీందర్‌ పహల్ (1) పాయింట్లు సాధించారు. పింక్‌ పాంథర్స్‌లో అర్జున్‌ దేస్వాల్‌(10), దీపక్‌ నివాస్‌ హుడా(4), సందీప్‌ దుల్‌ (3), నితిన్‌ రావల్‌ (2),అమిత్ హుడా (2), అమిత్‌(1), విశాల్‌(1) పాయింట్‌ సాధించారు.

రెండో మ్యాచ్‌లో దబాంగ్‌ దిల్లీ, పుణెరి పల్టాన్‌ తలపడ్డాయి. ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో పుణెరి పల్టాన్‌పై 41-30 తేడాతో దబాంగ్‌ దిల్లీ జయకేతనం ఎగురేసింది. దబాంగ్‌ దిల్లీలో నవీన్‌ కుమార్‌ (16) పాయింట్ల సాధించి జట్టులో కీలక పాత్ర పోషించగా.. విజయ్ మాలిక్‌ (9) రాణించాడు. పుణెరి పల్టాన్‌ జట్టులో నితిన్ తోమర్‌ (7), రాహుల్‌ చౌదరి (5), పంకజ్‌ మోహిత్‌(5), అస్లాం ఇనాందార్‌ (4), జాదవ్‌ (2), సోంబిర్‌(2), విశాల్ భరద్వాజ్‌ (1) పాయింట్లతో రాణించారు. ఇక మూడో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌పై పట్నా పైరేట్స్‌ 42-39 తేడాతో నెగ్గింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని