Sports News: ఇంట్లో వాళ్లకు తెలియకుండా..
ఆ అమ్మాయికి బాక్సింగ్ అంటే ప్రేమ.. చేతులకు గ్లోవ్స్ వేసుకుని రింగ్లో ప్రత్యర్థులపై పంచ్లు విసరాలనే కోరిక.. కానీ ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. తండ్రి వద్దన్నా.. కుటుంబ సభ్యులు మద్దతివ్వకున్నా ఆమె కాళ్లు బాక్సింగ్ రింగ్ వైపే నడిచాయి...
ఒలింపిక్స్ పతకంపై ఆశలు రేకెత్తిస్తోన్న బాక్సర్ పూజారాణి
ఆ అమ్మాయికి బాక్సింగ్ అంటే ప్రేమ.. చేతులకు గ్లోవ్స్ వేసుకుని రింగ్లో ప్రత్యర్థులపై పంచ్లు విసరాలనే కోరిక.. కానీ ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. తండ్రి వద్దన్నా.. కుటుంబ సభ్యులు మద్దతివ్వకున్నా ఆమె కాళ్లు బాక్సింగ్ రింగ్ వైపే నడిచాయి.. ఆమె చేతులు పిడిగుద్దులు కురిపించాయి. ఆరు నెలల పాటు ఇంట్లో వాళ్లకు తెలీకుండా రహస్యంగా శిక్షణ పొందిన ఆమె.. జాతీయ యూత్ బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచి తల్లిదండ్రుల అభిప్రాయాన్ని మార్చింది. అప్పటి నుంచి వాళ్ల ప్రోత్సాహంతో ఆటలో ఎదిగిన పూజా రాణిఇప్పుడు అంతర్జాతీయ వేదికపై మెరుస్తోంది. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో వరుసగా రెండో స్వర్ణాన్ని సొంతం చేసుకుని.. ఒలింపిక్స్ పతకంపై ఆశలు రేకెత్తిస్తోంది.
ఈనాడు క్రీడావిభాగం
తమ పిల్లలను ఆటల వైపు నడిపించే తల్లిదండ్రులుంటారు. ఆటలెందుకు? దెబ్బలు తగులుతాయి.. బుద్ధిగా చదువుకోవాలంటూ వ్యతిరేకించే అమ్మానాన్నలూ ఉంటారు. ఇంట్లో వాళ్లు వద్దన్నారని ఎంతో మంది తమకిష్టమైన ఆటలను వదులుకుంటారు. పూజ కూడా అలాగే చేసి ఉంటే ఇప్పుడు ఆమె గురించి మనం ఇలా చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. బాక్సింగ్లో శిక్షణ తీసుకుంటానంటే తండ్రి ఒప్పుకోకపోయినా.. కుటుంబ సభ్యులు వద్దన్నా.. ఆమె వినలేదు. ఆటలో సత్తాచాటి తన నైపుణ్యాలను వాళ్లకు చాటి చెప్పాలనుకుంది. అందుకే ఇంట్లో తెలీకుండా శిక్షణ కొనసాగించింది. జాతీయ స్థాయిలో విజయాలతో వెలుగులోకి వచ్చింది. బాక్సింగ్ ఎందుకు అన్న వాళ్లతోనే చప్పట్లు కొట్టించింది. ఆటలో కొనసాగమని చెప్పేలా చేసింది. హరియాణాకు చెందిన 30 ఏళ్ల పూజ ఆలస్యంగానే ఆటలో అడుగుపెట్టినప్పటికీ.. అద్భుత ప్రదర్శనతో సాగుతోంది.
గాయాలను దాటి..
వేగంగా దూసుకెళ్లిన ఆమె కెరీర్కు మధ్యలో గాయాలు కళ్లెం వేశాయి. ఆసియా ఛాంపియన్షిప్స్లో 2012లో రజతం, 2015లో కాంస్యం సాధించిన ఆమె.. 2014 ఆసియా క్రీడల్లో కంచు పతకం గెలిచింది. అయితే అగ్రశ్రేణి బాక్సర్గా ఎదిగే దిశగా సాగుతున్న ఆమె ప్రయాణంలో గాయాలు అడ్డంకిగా మారాయి. 2016, 2017లో ప్రమాదకరమైన గాయాలతో పోరాడిన తను ఆత్మవిశ్వాసంతో వాటి నుంచి కోలుకుంది. భుజం గాయం నుంచి బయటపడి తిరిగి రింగ్లో అడుగుపెట్టి మునుపటి దూకుడు అందుకునేందుకు శ్రమించింది. 2019 ఆసియా ఛాంపియన్షిప్లో 81 కేజీల విభాగంలో స్వర్ణంతో మళ్లీ ఫామ్లోకి వచ్చింది. అయితే టోక్యో ఒలింపిక్స్లో ఆ విభాగం లేకపోవడంతో 75 కేజీల కేటగిరీకి మారాలని నిర్ణయించుకుంది. ఆ దిశగా బరువు తగ్గించుకునేందుకు శ్రమించింది. నిరుడు లాక్డౌన్కు ముందు ఆసియా- ఓషియానియా జోన్ అర్హత టోర్నీలో సత్తాచాటి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత మహిళా బాక్సర్గా నిలిచింది. ఈ ఏడాది జులై 23న ఆరంభం కానున్న ఒలింపిక్స్కు ముందు చివరి ప్రధాన టోర్నీ అయిన ఆసియా ఛాంపియన్షిప్లో పసిడి చేజిక్కించుకున్న ఆమె.. టోక్యోలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించే దిశగా సాగుతోంది.
అలా గ్లోవ్స్తో..
కళాశాలలో చేరిన తర్వాతే పూజ బాక్సింగ్ వైపు అడుగులు వేసింది. అది కూడా అనుకోకుండా జరిగిందే. పూజ ఎత్తుగా ఉండడంతో కళాశాలలోని ఓ ప్రొఫెసర్ భార్య ఆమెను బాక్సింగ్ ఎంచుకోమని పట్టుబట్టింది. కానీ గ్లోవ్లు వేసుకోవడం అసౌకర్యంగా అనిపించడంతో మొదట్లో సందేహించింది. కానీ ఆమెకు.. ఆ ప్రొఫెసర్ భార్య గ్లోవ్లు ఎలా వేసుకోవాలో నేర్పించింది. అప్పుడు అలా చేతులకు గ్లౌజులు వేసుకున్న పూజ.. ఇప్పడు ప్రత్యర్థులపై విరుచుకుపడుతోంది. ఆ తర్వాత తనకు బాక్సింగ్పై ప్రేమ త్వరగానే పుట్టింది. ఇక అదే లోకమైంది. కానీ కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోకపోవడంతో తీవ్ర నిరాశ చెందింది. పోలీస్ అయిన ఆమె తండ్రి బాక్సింగ్ చేసేందుకు అంగీకరించలేదు. అది దూకుడైన ఆట కాబట్టి గాయాలయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అలా అయితే తన కూతురి పెళ్లికి ఇబ్బంది అవుతుందని భావించిన అతను.. పూజ ఇష్టాన్ని నిరాకరించాడు. కానీ మరోవైపు ఆమె మాత్రం వాళ్లకు తెలీకుండా రహస్యంగా శిక్షణ కొనసాగించింది. శిక్షణలో గాయాలైతే.. అవి ఇంట్లో వాళ్లకు కనిపించకుండా జాగ్రత్త పడేది. మరీ పెద్ద దెబ్బలు తగిలితే.. అవి తగ్గేదాకా ఇంటికి వెళ్లకుండా కోచ్ లేదా స్నేహితుల దగ్గర ఉండేది. ఇంట్లో ఆ గాయాలు చూస్తే తనను బాక్సింగ్కు దూరం చేస్తారని ఆమె భయం. అలా ఆరు నెలలు గడిచిపోయాయి. బాక్సింగ్లో ఆమె పట్టు సాధించింది. 2009లో జాతీయ యూత్ బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచింది. కోచ్ వచ్చి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడడంతో.. ఆ విజయం తర్వాత పూజ ఆటలో కొనసాగేందుకు తల్లిదండ్రులు అనుమతించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి