Pujara: ఒక సెంచరీ.. 1,443 రోజులు.. 52 ఇన్నింగ్స్లు.. పుజారా సాధించేశాడు
ఒక క్రికెటర్ జీవితంలో నాలుగేళ్ల కాలం చాలా విలువైంది. స్టార్ ప్లేయర్లు కూడా జట్టులోస్థానం కోల్పోయి కనుమరుగవుతుంటారు. అయితే పుజారా మాత్రం పడిన చోటే లేచి నిలబడి తనకంటూ ఉన్న ప్రత్యేకతను చాటి చెప్పాడు. ఫామ్ కోసం పడిన కష్టానికి సరైన ఫలితం పొందాడు.
ఇంటర్నెట్ డెస్క్: సుదీర్ఘ నిరీక్షణను ‘నయా వాల్’ బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్లో సహనానికి మారుపేరుగా నిలిచిన అతగాడు ఒకానొక సమయంలో జట్టుకు భారంగా మారాడనే విమర్శలు తెచ్చుకొన్నాడు. ఇంకెన్నాళ్లు భరిస్తారు అనే మాటలు వినిపించాయి. దీంతో జట్టులో స్థానం కూడా కోల్పోవాల్సి వచ్చింది. టెస్టుల్లో వరుసగా కీలక ఇన్నింగ్స్లు ఆడిన ఛెతేశ్వర్ పుజారా టెస్టుల్లో ఎప్పుడో జనవరి 2019లో సెంచరీ బాదాడు. ఇప్పుడు తాజాగా 52 ఇన్నింగ్స్లు.. 1,443 రోజులు గడిస్తేకానీ మరో శతకం పుజారా ఖాతాలో పడటం గమనార్హం. ఎట్టకేలకు బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీతో గుండెలపై భారం దించుకొన్నాడు. మొదటి ఇన్నింగ్స్లోనే (90) శతకానికి కాస్త దూరంలో నిలిచి నిరాశకు గురైనప్పటికీ.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేసేశాడు.
దాదాపు నాలుగేళ్ల తర్వాత కెరీర్లో 19వ శతకం బాదిన పుజారా.. ఇదేదో ఆచితూచి ఆడుతూనో.. ఎక్కువ బంతులను వృథా చేసి సెంచరీ సాధించలేదు. జట్టుకు అవసరమైన సమయంలో వన్డే మాదిరిగా దూకుడు ప్రదర్శిస్తూనే కేవలం 130 బంతుల్లోనే 102 పరుగులు రాబట్టాడు. ఓపెనర్ శుబ్మన్ గిల్ (110)తో కలిసి రెండో వికెట్కు 113 పరుగులు జోడించాడు. దీంతో బంగ్లా ఎదుట 500కిపైగా భారీ లక్ష్యం నిర్దేశించడంలోకీలక పాత్ర పోషించాడు.
కారణమదేనా..?
జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత పుజారా వంటి స్టార్ ఆటగాడు దేశీయ పోటీల్లో ఆడతాడని ఎవరూ ఊహించి ఉండరు. అలాగని కేవలం దేశవాళీ క్రికెట్ ఆడితే ఇక్కడి పిచ్ పరిస్థితులు మాత్రమే తెలుస్తాయి. విదేశాల్లో రాణించాలంటే ఆ తరహా వికెట్ మీద ఆడితేనే ప్రయోజనం ఉంటుందని భావించాడు. దీంతో కౌంటీ క్రికెట్కు నిలయమైన యూకేకి పయనమయ్యాడు. సర్రే తరఫున ఆడిన పుజారా.. వరుస మ్యాచుల్లో సెంచరీలతో కదం తొక్కాడు. ఇవన్నీ టెస్టులు అనుకొంటే పొరపాటే.. కేవలం 50 ఓవర్ల మ్యాచుల్లోనే దంచి కొట్టాడు. వన్డేలకు కూడా పనికొస్తాననే సంకేతం పంపాడు. సర్రే తరఫున ఆడిన అనుభవంతో ఫామ్లోకి వచ్చిన పుజారాకి.. తాజాగా బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ మంచి అవకాశంలా దొరికింది. రెండు ఇన్నింగ్స్ల్లోనూ అద్భుతంగా ఆడిన పుజారాకు నాలుగేళ్లపాటు శతకం కొట్టలేదనే భారం కూడా దిగిపోయింది. రానున్న కాలంలో ఈ ‘నయా వాల్’ కఠిన పరిస్థితుల్లోనూ దృఢంగా ఆడతాననే భరోసాను అభిమానుల్లో కల్పించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?