ఆసీస్ బౌలర్లతో అందుకే దెబ్బలు తిన్నా: పుజారా
ఆస్ట్రేలియా పర్యటనలో తన బ్యాటింగ్పై విమర్శలు వచ్చినా కావాలనే నెమ్మదిగా ఆడినట్లు టీమ్ఇండియా బ్యాట్స్మన్ ఛెతేశ్వర్ పుజారా అన్నాడు. ఈ పర్యటనలో మూడు అర్ధశతకాలు సాధించి...
గబ్బా టెస్టుపై నోరువిప్పిన నయావాల్
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియా పర్యటనలో తన బ్యాటింగ్పై విమర్శలు వచ్చినా కావాలనే నెమ్మదిగా ఆడినట్లు టీమ్ఇండియా బ్యాట్స్మన్ ఛెతేశ్వర్ పుజారా అన్నాడు. ఈ పర్యటనలో మూడు అర్ధశతకాలు సాధించిన అతడు మొత్తం 271 పరుగులు చేశాడు. దాంతో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన నయావాల్ గబ్బా టెస్టులో ఆసీస్ బౌలర్ల దెబ్బలను కాచుకోడానికి గల కారణాన్ని వివరించాడు.
‘గబ్బా టెస్టులో ఎలా ఆడాలో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. చివరిరోజు తొలి సెషన్లో వికెట్లు కోల్పోకూడదని అనుకున్నా. ఎందుకంటే అది రెండు, మూడో సెషన్లలో ఆస్ట్రేలియాకు అనుకూలంగా అవుతుంది. అయితే, అనుకోకుండా ఒక వికెట్ కోల్పోవడంతో పరుగులు రాకున్నా నేను క్రీజులో పాతుకుపోవాలని నిర్ణయించుకున్నా. తర్వాత రెండు, మూడు సెషన్లలో ధాటిగా ఆడాలనుకున్నా. కానీ, అప్పటికే పిచ్లో అనూహ్య మార్పులు కనిపించాయి. కొన్ని బంతులు తక్కువ ఎత్తులో రాగా, మరికొన్ని ఊహించిన దానికంటే ఎక్కువ బౌన్స్ అయ్యాయి. దాంతో ఆ బంతులను ఎదుర్కోవడం చాలా కష్టంగా అనిపించింది’ అని పుజారా పేర్కొన్నాడు.
‘ఆ బంతులను ఎదుర్కోవాలంటే ఒకటే మార్గం కనిపించింది. అది ప్రమాదమని కూడా తెలుసు. కాకపోతే వేరే అవకాశం లేకపోయింది. ఆసీస్ బౌలర్లు వేసే బంతులు గ్లోవ్స్కు తగిలితే అవి క్యాచ్లుగా వెళ్లే అవకాశం ఉండింది. దాంతో ఆ బంతుల్ని నా శరీరానికి తగిలించుకున్నా. బంతిని హెల్మెట్ మీద తగిలించుకోవడం మంచిదికాదు. అయినా, నేను దాని గురించి ఆలోచించలేదు. శరీరానికి తగిలినప్పుడు కొన్ని విపరీతమైన నొప్పిని కలిగించేవి. అన్నింటికంటే ఎక్కువ బాధించింది చేతివేళికి తాకిన బంతి. మెల్బోర్న్ టెస్టులో ప్రాక్టీస్ సమయంలో అదే వేలికి ఒక బంతి తగిలింది. దాంతో విపరీతమైన నొప్పి పుట్టింది. ఈ నేపథ్యంలోనే నా ఆట మంచిగా అనిపించకపోయినా, నెమ్మదిగా సాగినా వికెట్ కాపాడుకోవాలని అనుకున్నా. నిజం చెప్పాలంటే జట్టుకు ఏది మంచో.. ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు. ఎందుకంటే జట్టుతో చాలా ఏళ్లుగా కలిసి ఆడుతున్నా. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు శక్తిసామర్థ్యాల మేరకు ఉత్తమ ప్రదర్శన చేయడానికే ప్రయత్నిస్తా’ అని పుజారా చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి..
బౌలర్లు బౌండరీలు ఇస్తే.. శాస్త్రి అరిచేస్తాడు
మిథాలి రాజ్గా బ్యాటింగ్ చేస్తున్న తాప్సీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!