రాబోయే రెండూ.. భారత్కు అత్యంత కీలకం
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరగబోయే మిగిలిన రెండు టెస్టులూ టీమ్ఇండియాకు అత్యంత కీలకమని స్పెషలిస్టు బ్యాట్స్మన్ చెతేశ్వర్ పుజారా అన్నాడు. మరీ ముఖ్యంగా బుధవార...
ఇంటర్నెట్డెస్క్: అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరగబోయే మిగిలిన రెండు టెస్టులూ టీమ్ఇండియాకు అత్యంత కీలకమని స్పెషలిస్టు బ్యాట్స్మన్ చెతేశ్వర్ పుజారా అన్నాడు. మరీ ముఖ్యంగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే డై/నైట్ టెస్టు చాలా ముఖ్యమని చెప్పాడు. కోహ్లీసేన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో న్యూజిలాండ్తో తలపడాలంటే మిగిలిన రెండు టెస్టుల్లో.. ఒకటి గెలిచి, ఒక డ్రా చేసుకోవాలి. లేదా రెండూ గెలవాలి. ఈ నేపథ్యంలోనే మొతేరాలో జరగబోయే మిగతా మ్యాచ్లు చాలా కీలకమైనవని పేర్కొన్నాడు.
‘మేం భారత్లో ఒకే డే/నైట్ టెస్టు ఆడాము. అది కూడా ఎస్జీ బంతితో. దేశవాళీ క్రికెట్లో నేను ఆడింది మొత్తం కాకాబుర్రా బంతితో. అలాగే నేను ఎక్కవ టెస్టులు ఆడినప్పటికీ పింక్బాల్తో ఆడిన అనుభవం పెద్దగా లేదు. సిరీస్కు ఒక పింక్బాల్ మ్యాచ్ ఆడటంలో అనుభవం అక్కర్లేదని నేననుకుంటా. ఆ బంతితో ఆడేకొద్దీ అనుభవం అదే వస్తుంది. ఇదొక టెస్టు క్రికెట్ మాత్రమే’ అని పుజారా చెప్పుకొచ్చాడు.
ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్పై మాట్లాడుతూ.. ‘లార్డ్స్లో తుదిపోరుకు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ ఎంతో కీలకం. కాబట్టి ఈ పింక్బాల్ టెస్టుపై పూర్తి దృష్టి సారిస్తాం. ఒక జట్టుగా మాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం. మిగిలిన రెండు టెస్టులూ ఎంతో కీలకం కాబట్టి మా ప్రణాళికలకు కట్టుబడి ఉంటాం’ అని నయావాల్ వివరించాడు.
పుజారా ఈ సిరీస్లో తొలి టెస్టులో 73, 15 రెండో టెస్టులో 21, 7 పరుగులు చేశాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలోనూ అర్ధశతకాలతో రాణించినా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో రాబోయే టెస్టుల్లోనైనా అతడు భారీ స్కోర్లు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు పుజారా ఇటీవల జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ వేలంలో పాల్గొన్నాడు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ రూ.50లక్షలకు అతడిని కొనుగోలు చేసింది. అయితే, ఏడేళ్ల తర్వాత తిరిగి ఈ మెగా ఈవెంట్లో అడుగుపెడుతున్నాడు. మరి ధోనీ జట్టులో ఎలా ఆడనున్నాడో వేచిచూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్