PV Sindhu: కాలి నొప్పి ఉందని భయపడ్డాం.. కానీ అద్భుతంగా ఆడింది: సింధూ తల్లిదండ్రుల ఆనందం
కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ విశ్వవేదికపై మరోసారి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. కామన్వెల్త్ క్రీడల్లో
ఇంటర్నెట్డెస్క్: కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ విశ్వవేదికపై మరోసారి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో కెనడాకు చెందిన మిషెల్లీ లీపై జయభేరి మోగించి స్వర్ణం సాధించడం పట్ల దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో సింధూ పసిడిని ముద్దాడటంతో ఆమె తల్లిదండ్రులు తమ ఆనందాన్ని ‘ఈటీవీ’తో పంచుకున్నారు.
ఈటీవీ: కంగ్రాట్స్ సర్.. ఎలా ఫీల్ అవుతున్నారు?
సింధు తండ్రి రమణ: చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సింధూ 2014 కామన్వెల్త్లో కాంస్యం, 2018లో రజతం, ఇప్పుడు గోల్డ్. ఒక క్రీడాకారిణి 12 ఏళ్ల నుంచి కష్టపడుతూ.. ప్రతి ప్లేయరూ గోల్డ్ కోసమే కష్టపడతారు. కానీ అది రాకపోతే చాలా నిరుత్సాహానికి గురవుతారు. ఆ కలను సాకారం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
ఈటీవీ: మిషెల్లీ లాంటి చాలా సీనియర్ ప్లేయర్తో ఫైనల్స్లో సింధూ చాలా ఈజీగా ఆడింది కదా!
ఇది కాన్ఫిడెన్స్పై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న ప్లేయర్ల కన్నా ర్యాంకుల్లో సింధూ పెద్దది. వీళ్లందరిపైనా ఆడి చాలాసార్లు గెలవడం వల్ల అదొక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఫైనల్స్లో ప్రతిఒక్కరూ ఒత్తిడితో ఆడతారు. దాన్ని అధిగమించి నాలుగైదు పాయింట్లు లీడ్లో పెట్టుకొని రిథమ్ను అలాగే మెయింటెయిన్ చేసుకొని గెలిచింది. దీనివల్ల చాలా ఈజీ అయిపోయింది. లేకపోతే అందరం టెన్షన్ పడాల్సి వచ్చేది.
సింధూ ఆడే ప్రతి గేమ్లోనూ మీరు పక్కనే ఉండి ఎంకరేజ్ చేస్తుంటారు. ఇప్పుడు వెళ్లినప్పుడు ఎలాంటి సూచనలు ఇచ్చారు?
నేను ముందే సింధుకి చెప్పాను. మార్నింగే మెసెజ్ చేశాను. ఆ అమ్మాయి ఫలానా రీతిలో ఆడుతుంది.. నువ్వు ఇలా ఆడాలని చెప్పా. ఫిట్నెస్ ట్రైనర్, ఫిజియో ఉన్నారుగనక కొంచెం తప్పులేమైనా చేసినా కొంచెం నేనేవాళ్లతో చెప్పి ఇలా సూచించండి చెప్పాను.
సింధూ స్వర్ణం సాధించడం పట్ల రాష్ట్రపతి దగ్గర నుంచి దేశమంతా గర్విస్తూ ట్వీట్లు చేస్తున్నారు.. ఒక ఫాదర్గా ఆ ఫీలింగ్ మీకెలా ఉంది?
ఆ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే.. సింధూ దేశానికే గర్వకారణమంటూ 2016లోనే కటౌట్లు పెట్టారు. ఒక బ్రాండ్ ఇమేజ్ని తనంతట తాను క్రియేట్ చేసుకుంది. ప్రతిఒక్కరికీ సింధూ తెలుసు. భగవంతుడు ఇలాంటి అమ్మాయిని ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ నుంచి ఇది రెండో గోల్డ్. సింధూ తెలంగాణలోనే పుట్టింది. ఉద్యోగ రీత్యా ఇప్పుడు ఏపీలో చేస్తోంది. ఆమెకు తెలంగాణ ఒక కన్ను. ఆంధ్రా ఇంకొక కన్ను. సింధూకి ఏదీ తక్కువ కాదు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఒకేరకంగా ప్రోత్సహించాయి. ఎవరూ తక్కువ చేయలేదు. ఎంతగానో ప్రోత్సహించిన సీఎం కేసీఆర్, సీఎం జగన్లకు కృతజ్ఞతలు. ప్రతి ప్లేయరూ ఎంచుకున్న గేమ్లో కష్టపడాలి. కష్టం లేనిదే ఫలితం రాదు. కష్టం ఒక్కరోజో ఒక్క నెలలోనో రాదు. ఎన్నో ఏళ్ల కృషి ఉండాలి. అలా ఆలోచించి ప్రతి ప్లేయరూ కష్టపడితే మనకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ప్లేయర్లను కేంద్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ, క్రీడా మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. ప్రతి దేశంతో పోటీ పడుతూ బాగా ఆడాలి. గెలవాలన్న పట్టుదల ఉండాలి. మన ప్లేయర్లకు ఆ పట్టుదల ఉంటుంది. రేపు రాబోయే ఏషియన్ గేమ్స్ గానీ, ఒలింపిక్స్లో గానీ కష్టపడి ఆడాలి.
కామన్వెల్త్తో పాటు ఇంకేదైనా తన కల అని సింధూ చెప్పారా?
దీని తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్.. ఇలా ఏటా ఉంటూనే ఉంటాయి. తర్వాత ఏషియన్ గేమ్స్ ఉన్నాయి. తన లక్ష్యం 2024 ఒలింపిక్స్లో ఆడదామని. ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఆడితే తప్పకుండా మెడల్ గెలవాలని కోరుకుంటున్నాం.
భయపడ్డాం.. కానీ ఎక్కడా రిలాక్స్ కాలేదు: సింధు తల్లి విజయ
‘‘కామన్వెల్త్ గేమ్స్లో సింధు స్వర్ణ పతకం సాధించడం ఆనందంగా ఉంది. దేశం కోసం బ్యాడ్మింటన్లో తను మెడల్ సాధించడం చాలా సంతోషకరం. దేశం సాధించిన పతకాల్లో సింధూ కూడా ఒక స్వర్ణం సాధించింది. రెండు మూడు రోజుల నుంచి కొద్దిగా కాలు స్ట్రెయిన్ అయింది. దీంతో కొంచెం మేం భయపడ్డాం. కానీ అంచనాలకు తగినట్టుగా తన ఆటతీరుతో ఫైనల్స్లో గెలవడం ఆనందంగా ఉంది. ఎక్కడా రిలాక్స్ కాకుండా తన మొహంలో పెయిన్ కూడా ఎక్కడా కనబడనివ్వలేదు. ఇన్నేళ్లు కష్టపడిన సింధుకు ప్రతిఫలం లభించినందుకు సంతోషంగా ఉంది. అలాగే, అందరి తల్లిదండ్రులకూ నేను చెప్పేదొకటే. మీ పిల్లలు ఏ రంగాన్ని ఇష్టపడుతున్నారో అందులోనే ప్రోత్సహిస్తే తప్పకుండా వాళ్ల కోసం ఆడతారు.. మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారు. అందువల్ల వాళ్లకు ఇష్టమైన ఫీల్డ్లో ఎంకరేజ్ చేయాలని కోరుతున్నా. కామన్వెల్త్ క్రీడల్లో అందరూ బాగా ఆడారు. చాలా పతకాలు వచ్చాయి’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
దిల్లీ అదరగొట్టింది. ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
Gujarat vs Delhi: పంత్ వికెట్ కీపింగ్ అదుర్స్.. ఒంటి చేత్తో సూపర్ క్యాచ్
గుజరాత్తో జరిగిన మ్యాచ్లో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ వికెట్ కీపింగ్తో అదరగొట్టాడు. ఇషాంత్ శర్మ వేసిన ఐదో ఓవర్లో చివరి బంతికి వికెట్ కీపర్ పంత్ అద్భుతంగా డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో మిల్లర్ వెనుదిరిగాడు.
-
నరైన్ అరుదైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్ నమోదు చేసినందుకు కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు. -
ఎప్పుడూ నాతోనే.. కుమారుడిపై శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్
గాయం నుంచి కోలుకుని ముంబయితో మ్యాచ్కు శిఖర్ ధావన్ సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడిపై పెట్టిన పోస్టు వైరల్గా మారింది. -
దూకుడైన బ్యాటింగ్తోనే కప్ కొట్టగలం..: రికీ పాంటింగ్
ఒకప్పుడు నాణ్యమైన బౌలింగ్ వనరులు ఉంటే జట్టు గెలవడం సులువని భావించేవారు. కానీ, ఇప్పుడు బౌలింగ్ కాస్త ఫర్వాలేదనిపించినా.. లోతైన బ్యాటింగ్ ఉండాలని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా రికీ పాంటింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. -
గౌతమ్ గంభీర్ బాధ పడొద్దు.. కాస్త నవ్వుతూ ఉండు: షారుఖ్ ఖాన్
ఈ సీజన్లో కోల్కతాకు రెండో ఓటమి ఎదురైంది. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ చివరి బంతికి గెలిచింది. -
కోహ్లీనే తక్కువ పరుగులు ఇస్తాడేమో.. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో ఆడాలి: క్రిష్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు విజయాలబాట పట్టాలంటే.. జట్టు, ప్రణాళికల్లో మార్పులు అవసరమని భారత మాజీ క్రికెటర్ కీలక సూచనలు చేశాడు. -
క్రీజ్లో బట్లర్.. చివరి ఓవర్ను వరుణ్కి ఇవ్వడానికి కారణమదే: శ్రేయస్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ను ఓడించాలని భావించిన కోల్కతాకు చుక్కెదురైంది. జోస్ బట్లర్ పోరాడి వారి ఆశలకు గండికొట్టాడు. -
ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీని అనుసరించా: జోస్ బట్లర్
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో కోల్కతాను రాజస్థాన్ చివరి బంతికి ఓడించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో జోస్ బట్లర్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. -
బాప్రే బట్లర్.. ఒత్తిడిలో అద్భుత బ్యాటింగ్
ఆరు ఓవర్లలో 96 పరుగులు... ఎలాంటి పిచ్పైనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఛేదన చాలా చాలా కష్టం. పైగా ఆరు వికెట్లు పోయాయి. కోల్కతాతో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతున్న రాజస్థాన్ ఓపెనర్ బట్లర్కు సహకరించే వారూ లేరు. -
జ్యోతి వెలిగింది.. పారిస్ మురిసింది
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్కు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా ఇంకో వంద రోజుల్లోనే పారిస్లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. -
టీ20 ప్రపంచకప్లో.. హార్దిక్ బౌలింగ్ చేస్తేనే..
రాబోయే టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య ఆడతాడా? ఐపీఎల్లో ఇప్పటిదాకా ఈ ఆల్రౌండర్ ప్రదర్శన చూసిన అభిమానుల్లో తలెత్తుతున్న ప్రశ్న ఇదే. కొన్ని నెలల ముందు వరకు అతడి సారథ్యంలోనే టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ ఆడుతుందని అంతా అనుకున్నారు. -
ఐపీఎల్కు మ్యాక్స్వెల్ నిరవధిక విరామం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పేలవమైన ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ ఐపీఎల్ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. -
నాదల్ విజయంతో..
స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ పునరాగమనాన్ని విజయంతో మొదలుపెట్టాడు. బార్సిలోనా ఓపెన్ తొలి రౌండ్లో అతడు 6-2, 6-3తో ఫ్లావియో కొబాలి (ఇటలీ)పై విజయం సాధించాడు. -
అగ్రస్థానంలో గుకేశ్
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నెపోమ్నియాషి (రష్యా)తో జరిగిన పదో రౌండ్ గేమ్ను అతడు డ్రాగా ముగించాడు. -
రోహిత్ ఓటమి
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రోహిత్ దహియా పోరాటం ముగిసింది. మంగళవారం 82 కేజీల విభాగం కాంస్య పోరులో ఈ భారత కుర్రాడు 1-3తో రసులోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడాడు. -
నరైన్ శతకం వృథా.. సెంచరీ చేసి రాజస్థాన్ను గెలిపించిన బట్లర్
కోల్కతాపై రాజస్థాన్ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. 224 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ చివరి బంతికి విజయం సాధించింది. ఆ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ శతకం(107*)తో చెలరేగాడు.
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్